అదితికి కడపటి వీడ్కోలు: కన్నీరు మున్నీరైన తల్లిదండ్రులు (పిక్చర్స్)
విశాఖపట్నం: విశాఖపట్నంలోని డ్రైనేజీలో కొట్టుకుపోయిన మరణించిన చిన్నారి అదితికి శుక్రవారం విశాఖ నగరం కన్నీటి వీడ్కోలు పలికింది. గత నెల 24న నగరంలో కురిసిన భారీ వర్షానికి రోడ్లపై నీరు భారీగా చేరడం, అదే సమయంలో అదితి ట్యూషన్ నుంచి బయటకు వచ్చి, కారు ఎక్కుతున్నప్పుడు ప్రమాదవశాత్తు కాలువలో పడి కొట్టుకుపోయిన విషయం తెలిసిందే
అదితి జాడ కోసం వారం రోజులపాటు గాలించారు. చివరికి గురువారం సాయంత్రం సుమారు ఆరు గంటల సమయంలో అదితి శవమై విజయనగరం జిల్లా భోగాపురం మండలం దిబ్బపాలెం సముద్ర తీరంలో కనిపించింది. శుక్రవారం ఉదయం అదితి మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించి, తరువాత బంధువులకు అప్పగించారు.
సీతమ్మధారలోని అదితి తాత వెంకటేశ్వరరావు ఇంటికి మృతదేహాన్ని తీసుకువెళ్లారు. అప్పటికే అదితి ఇంటి వద్దకు బంధువులు, నగర ప్రజలు భారీగా చేరుకున్నారు. అదితి మృతదేహం వద్ద నివాళులు అర్పించారు. ఇదే సమయంలో అదితి తండ్రి శ్రీనివాసరావుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫోన్ చేసి ఓదార్చారు. జరిగిన దుర్ఘటన పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అదితి మృతదేహానికి అంత్యక్రియలు
అదితి మృతదేహానికి మధ్యాహ్నం విశాఖపట్నంలోని మద్దిలపాలెం శ్మశానవాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

కంటతడి పెట్టిన ప్రజలు
టీవీ చానెళ్లలో అదితి అంతిమయాత్ర దృశ్యాలను చూసి నగర ప్రజలు చలించిపోయి కంటతడిపెట్టారు.
పోస్ట్మార్టం ప్రాథమిక నివేదికఅదితి మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించిన తరువాత డాక్టర్లు ప్రాథమిక నివేదికను విడుదల చేశారు.

నివేదిక ఇలా..
అదితి ప్రమాదవశాత్తు కాలువలో పడి చనిపోయి ఉంటుందని పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నారు. కాగా, అదితి జాడ వారం రోజులైనా తెలియకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పూర్తి స్థాయి నివేదిక అందాల్సే ఉంది..
అదితి పోస్ట్మార్టం ప్రాథమిక నివేదిక వచ్చినప్పటికీ, పూర్తిస్థాయి నివేదిక అందాల్సి ఉంది. అప్పటి వరకూ కేసు మూసి వేయలేమని పోలీస్ అధికారులు చెపుతున్నారు.

కన్రెప్ప పాటులో...
గత నెల 24వ తేదీన కురిసిన వర్షానికి డ్రైనేజీ ఉప్పొంగుతుందని, తాను అందులో పడిపోతానని అదితి ఊహించి ఉండదు.

అన్వేషణ...
డ్రైనేజీలో మాయమైన అదితి ఏమైందోనని విశాఖపట్నం ప్రజలు ఆందోళన చెందారు. వారు రోజుల పాటు వారి ఉత్కంఠ కొనసాగుతూనే ఉన్నది.

క్షేమంగా బయటకు రావాలని...
అదితి క్షేమంగా బయటకు రావాలని విశాఖపట్నం ప్రజలు కోరుకున్నారు. ఆమె ఆనవాళ్లు లభించకపోవడంతో బతికే ఉందనే అనుమానాలను కూడా వ్యక్తం చేశారు.

కదిలిన యంత్రాంగం...
అదితి కోసం ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. పది పడవలను రంగంలోకి దించడంతో పాటు మత్స్యకారులను, నావికాదళ సభ్యులను, కమ్యూనిటీ గార్డులను, వందలాది పారిశుధ్య కార్మికులను గాలింపులో వినియోగించారు.

కోటిన్నర ఖర్చు..
స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా అదితి గాలింపులో తమ వంతు పాత్ర నిర్వహించాయి. కోటి రూపాయలు ఖర్చు చేశామని ప్రభుత్వ వర్గాలు చెబుతుననాయి.

విజయనగరం జిల్లాలో...
విజయనగరం జిల్లాలోని ఓ మారుమూల తీర ప్రాంతంలో ఏడు రోజుల తర్వాత అదితి విగతజీవిగా కనిపించింది.

కన్నీరు మున్నీరు..
అదితి మృతికి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. అదితి బతికే ఉంటుందనే మిణుకుమిణుకుమంటున్న ఆశ కూడా అడగంటిపోవడంతో వారు గుండెలు అవిసేలా విలపించారు.
-
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications