పోలింగ్ కేంద్రంలో ఎర్రకండువాతో జనసైనిక్- సినిమా చూపించిన వంగా గీత
Vanga Geetha: ఏపీలో పోలింగ్ జోరుగా సాగుతోంది. ఈ ఉదయం సరిగ్గా 7 గంటలకు రాష్ట్రంలో గల 175 అసెంబ్లీ, 25 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ మొదలైంది. ఉదయం 11 గంటల వరకు 24 శాతం మేర పోలింగ్ నమోదైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సహా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసుల, కేంద్ర ఎన్నికల అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను పూర్తి చేశారు. పోలింగ్ స్టేషన్ల వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండటానికి అవసరమైన అన్ని చర్యలను యుద్ధ ప్రాతిపదికన తీసుకున్నారు.
Recommended Video

కాకినాడ జిల్లా పిఠాపురంలో పోలింగ్ కొనసాగుతున్న సమయంలో జనసేన కార్యకర్తు ఒకరు అత్యుత్సాహాన్ని ప్రదర్శించాడు. జనసేన నాయకులు, కార్యకర్తలు ఎప్పుడూ ధరించే ఎర్రకండువాను మెడలో వేసుకుని పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించాడు. జనసేన పోలింగ్ ఏజెంట్గా భావిస్తోన్నారాతన్ని.క్యూలో నిల్చున్న మహిళల వద్ద మెడలో ఉన్న ఎర్రకండువాను ప్రదర్శిస్తూ, క్యూలైన్ను అదుపు చేస్తూ కనిపించాడు. అదే సమయంలో పోలింగ్ కేంద్రానికి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంగ గీత దీన్ని గమనించారు. ఆ ఎర్ర కండువాను తీసేయాలంటూ ఆదేశించారు. లేదంటే తాము కూడా వైఎస్ఆర్సీపీ కండువాలను కప్పుకొని పోలింగ్ స్టేషన్లకు వస్తామని చెప్పారు.

ఆ జనసైనికుడితో వాగ్వివాదానికి దిగారు. ఇది కండువా మాత్రమేనంటూ ఆ జన సైనికుడు వంగ గీతకు చెప్పాడు. ఈ వాగ్వివాదాన్ని గమనించిన విధి నిర్వహణలో ఉన్న ఎన్నికల సిబ్బంది.. అక్కడికి చేరుకుని, మెడలో ఉన్న కండువాను తీసేయించారు. అతన్ని బయటికి పంపించారు.ఈ ఎన్నికల్లో పవన్ కల్యాణ్.. కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన విషయం తెలిసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు వంగా గీతాపై ఆయన పోటీ చేశారు. పవన్ కల్యాణ్కు పిఠాపురంలో ఓటు హక్కు లేదు. మంగళగిరిలో ఆయనకు ఓటు ఉంది. అందుకే ఆయన ఇక్కడ తన ఓటు హక్కును వినియోగించుకోవాల్సి వచ్చింది.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications