వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాములు హత్య: అరెస్టైన నయీం ముఠా ఇదే(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మాజీ మావోయిస్టు నేత సాంబశివుడు సోదరుడు, తెరాస జిల్లా నేత కొనపురి రాములు హత్య కేసు నిందితులను మంగళవారం కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో పోలీసులు పట్టుకున్నారు.

ఈ నెల 11న నల్లగొండ పట్టణంలో రాములును హత్య చేసిన ముఠా సభ్యులు తిరువనంతపురంలోని ఓ లాడ్జీలో తలదాచుకున్న క్రమంలో అక్కడి పోలీసులు జరిపిన దాడుల్లో పట్టుబడ్డారు.

పట్టుబడిన వారు నయీం ముఠా సభ్యులు. నయీం ముఠా సభ్యుల్లో సోమయ్య, కుమార స్వామి, రమేష్, సురేష్, రవి, ఎల్లేష్‌లు ఉండగా ఈ విషయాన్ని ఆ రాష్ట్ర పోలీసులు ఏపి పోలీసులకు తెలిపారు.

నయీం

నయీం

నల్గొండ జిల్లా భువనగిరికి చెందిన నయీం పాతికేళ్ల క్రితం నక్సలైట్‌గా మారాడు. ఐపిఎస్ వ్యాస్ హత్య కేసులో నిందితుడిగా నిలిచాడు.

నయీం

నయీం

అనంతరం నక్సల్స్ నేతలతో విభేదాల కారణంగా వారికి శతృవుగా మారి పోలీసు పెద్దల సహకారంతో నక్సల్స్‌ను వారికి మద్ధతుగా నిలిచే పౌర హక్కుల సంఘాల నాయకులను అంతమొందించడం పనిగా పెట్టుకున్నాడు.

నయీం

నయీం

మావోయిస్టు రాష్ట్ర పార్టీ మాజీ కార్యదర్శి సాంబశివుడితో పాటు ఆయన తమ్ముడు కొనపురి రాములు హత్య కేసులో నయీంప్రధాన నిందితుడు.

నయీం

నయీం

పదుల సంఖ్యలో హత్యలు.. లెక్కలేనన్ని సెటిల్‌మెంట్లతో మొత్తం 40కి పైగా కేసులు నయీం సహా ఆయన ముఠా సభ్యులపై ఉన్నాయి.

నయీం

నయీం

ఈ నేపథ్యంలో ఈ నెల 11న తెలంగాణ రాష్ట్ర సమితి నేత కోనాపురి రాములును నల్గొండ జిల్లాలో నయీం గ్యాంగ్ ద్విచక్ర వాహనంపై వచ్చి హత్య చేసింది.

నయీం

నయీం

కోనాపురి రాములు హత్య నయీం ముఠా పనేనని పోలీసులు అనుమానించారు. ఇప్పుడు నయీం ముఠాలోని అరుగురు నిందితులను అరెస్టు చేశారు.

నయీం

నయీం

పట్టుబడిన వారు నయీం ముఠా సభ్యులు. నయీం ముఠా సభ్యుల్లో సోమయ్య, కుమార స్వామి, రమేష్, సురేష్, రవి, ఎల్లేష్‌లు ఉండగా ఈ విషయాన్ని ఆ రాష్ట్ర పోలీసులు ఏపి పోలీసులకు తెలిపారు.

English summary
Police arrest six in Konapuri Ramulu murder case
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X