కృష్ణా కాల్పులు: దర్యాఫ్తు ముమ్మరం, బిర్యానీ తిని..!

హత్య కోసం నిందితులు ఉపయోగించిన కారు ఎవరిదో గుర్తించారు. ఆ కారు ఓవర్ బంధువులు, స్నేహితులే హత్యకు కుట్ర పన్ని ఉంటారని అనుమానిస్తున్నారు. హత్యలో మొత్తం నలుగురు పాల్గొనగా ఇందులో ఇద్దరు స్థానికులుగా గుర్తించారు.
హనుమాన్ జంక్షన్ లాడ్జిలోని సీసీ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల ఆనవాళ్ల ప్రకారం నలుగురు వేరే ప్రాంతవాసులుగా తెలుస్తోంది. నిందితుల కోసం హైదరాబాద్, ఖమ్మం, తూర్పు గోదావరి జిల్లాలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. హత్య కోసం డీల్ జరిగినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఇందులో నిజం లేదని భావిస్తున్నారు.
కాగా, హత్య చేసిన నిందితులు.. తాము బస చేసిన హోటల్లో బిర్యానీ తిని అక్కడి నుండి పారిపోయారనట్లుగా వార్తలు వస్తున్నాయి. బుధవారం కృష్ణా జిల్లాలో ముగ్గురి హత్య కలకలం రేపిన విషయం తెలిసిందే. దీని పైన పోలీసులు విచారణ జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications