మళ్లీ ఆ జగన్ హయాం చట్టం..! ప్రధానికి వైసీపీ అనూహ్య డిమాండ్..!
ఏపీలో భూసంస్కరణల విషయంలో కూటమి సర్కార్ దూకుడు నేపథ్యంలో వైసీపీ (ysrcp) కూడా రూటుమార్చింది. ఓవైపు కేంద్రం ప్రతిపాదిస్తున్న, మద్దతిస్తున్న చట్టాలను ఏపీలో వేగంగా అమలు చేయడం ద్వారా గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను రాజకీయ కారణాలతో ఇక్కడ కూటమి పార్టీలు వ్యతిరేకించాయి. ఆ తర్వాత తమ డిమాండ్ కరెక్టే అని నిరూపించుకునేందుకు తమ ప్రభుత్వం రాగానే ఏపీ భూయాజమాన్య చట్టాన్ని రద్దు చేశాయి.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కూటమి సర్కార్ పై ఒత్తిడి పెంచేందుకు, అలాగే రాజకీయంగా బీజేపీ, టీడీపీ మధ్య గ్యాప్ పెంచేందుకు వైసీపీ రంగంలోకి దిగుతోంది. గతంలో జగన్ హయాంలో తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ చట్టం కేంద్రం చెప్తేనే తెచ్చామని, ఆ తర్వాత కూటమి ప్రభుత్వం దీన్ని రద్దు చేసేసిందని, దీని వల్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో పాటు వికసిత్ భారత్ లక్ష్యాలకు కూడా భంగం కలుగుతోందని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ మేరకు వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు ప్రధాని మోడీకి ఓ లేఖ రాశారు.

మీ ప్రభుత్వ లక్ష్యాలను, దార్శనికతను అనుగుణంగా ఏపీలో వైఎస్ జగన్ సర్కార్ ఏపీ ల్యాండ్ టైట్లింగ్ చట్టం 2023ను తీసుకువచ్చిందన్నారు. అయితే 2024 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వారు నిర్వహించిన సర్వేలో మన దేశం 154వ స్థానంలో ఉందనే సత్యాన్ని మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ , వికసిత్ భారత్ వంటి ప్రతిష్టాత్మక పథకాలకు ఇటువంటి ప్రగతిశీల చట్టం యొక్క అవసరాన్ని విస్మరిస్తూ, ఈ చట్టాన్ని వెనక్కి తీసుకొని రద్దు చేసిందని ఆరోపించారు.

భూవివాదాలను తగ్గించడం ద్వారా విదేశీ పెట్టబడుల ఆకర్షణతో పాటు వికసిత్ భారత్ లక్ష్యాల సాధన కోసం కేంద్రం ప్రతిపాదించిన ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని తాము అమలు చేస్తే చంద్రబాబు ప్రభుత్వం దీన్ని రద్దు చేసిందని, ఇప్పుడు ప్రధాని మోడీ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని తగు ఆదేశాలు ఇవ్వాలని ధర్మాన ప్రసాదరావు కోరారు. ఏపీతో పాటు అన్ని రాష్టాలూ ఈ చట్టాలు చేసేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని కూడా కోరారు. అంతర్జాతీయ మేటి రాజనీతిజ్ఞునిగా రూపొందుతున్న మన దేశ ప్రధానమంత్రికి సహకరించడం అంటే ఈ చట్టం అమలు చేయడమే అంటూ ధర్మాన తన లేఖను ముగించారు.
-
పెమ్మసానికి అంబటి స్ట్రాంగ్ వార్నింగ్..! -
సంక్షోభం వస్తే మీ సన్నద్ధత ఎంత ? సీఎంల భేటీలో ప్రధాని మోడీ..! -
PM Modi: సీఎంలకు మోడీ సందేశం ఇదే..! మళ్లీ ఆ కోవిడ్ మోడల్..! -
మార్కాపురం బస్సు ప్రమాద బాధితుల కోసం ప్రధాని కీలక ప్రకటన..!! -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం!











Click it and Unblock the Notifications