మీడియా పై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆగ్రహం ... ఎందుకంటే
మీడియానే వాడుకుని ఎదిగిన ప్రశాంత్ కిషోర్ కు ఇప్పుడు మీడియానే సమస్యగా మారిందా ? రాజకీయ వ్యూహకర్తగా రాజకీయ పార్టీలకు మీడియాను , సోషల్ మీడియాను ఎలా వాడుకోవాలో చెప్పిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు మీడియా విషయంలో ఇబ్బంది పడుతున్నారా ? వైయస్ జగన్ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరించిన పీకే ఇప్పుడు మీడియా పైనే మండిపడే పరిస్థితి ఎందుకొచ్చింది తెలుసుకోవాలంటే ఈ వార్త చదవండి.

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ .. మీడియాను, సోషల్ మీడియాను వాడటంలో దిట్ట
ప్రశాంత్ కిషోర్ దేశవ్యాప్తంగా రాజకీయ వ్యూహకర్తగా మంచి పేరు సంపాదించిన వ్యక్తి . గతంలో బీజేపీ కి పనిచేసి కేంద్రంలో బీజేపీ కి అధికారం అందించటంలో తోడ్పాటును అందించారని గుర్తించి ఏపీలో జగన్ ఏరికోరి ప్రశాంత్ కిషోర్ ను వ్యూహకర్తగా ఎంచుకొని తమ పార్టీ కోసం పని చేసేలా చేశారు. సోషల్ మీడియా లో ప్రశాంత్ కిషోర్ వైసీపీ ప్రభావం ప్రజల మనస్సులో పడేలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఫలితంగా 2019 ఎన్నికల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి సైతం ఏపీలో విజయ బావుటా ఎగురవేసి అధికారాన్ని చేజిక్కించుకున్నారు . ఎన్నికల తర్వాత కూడా వైసీపీ అధికారంలోకి వస్తే ప్రశాంత్ కిషోర్ అప్పుడు కూడా తమతో కలిసి పనిచేయాలని జగన్ కోరినట్లు వార్తలు వచ్చాయి అయితే ఈ విషయంలో క్లారిటీ లేదు.

పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ కి పని చేయనున్న ప్రశాంత్ కిషోర్
ఏపీలో జగన్ ప్రభుత్వ అధికారం చేపట్టాక ఇప్పటివరకు పీకే రోల్ ఏ మాత్రం కనిపించలేదు. అయితే ఆయన ప్రస్తుతం పని ఎక్కడ పని చేస్తున్నారు అన్న దానిపైన రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి . మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన అసహనానికి గురవుతూ మీడియా పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈయన ఐపాక్ పేరుతో ఓ టీమ్ ను నడుపుతున్నారు. రాజకీయ వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్న ఈయన ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ కోసం పనిచేయనున్నారు.
అయితే తాజాగా ఈ దిగ్గజ రాజకీయ వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ మరెక్కడో పని చేస్తున్నారంటూ వచ్చిన వార్తలపై , సదరు మీడియా పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టు పెట్టారు.

తానూ ఎక్కడ పని చేస్తున్నానో రోజుకో వార్తలు రాస్తున్న మీడియా పై ఆయన మండిపాటు
ప్రశాంత్ కిషోర్ మీడియా, వార్తా పత్రికలపై మండిపడ్డారు. ప్రస్తుతం ఆయన శివసేన యువనేత ఆదిత్య ఠాక్రేతో కలిసి పనిచేస్తున్నారని ఓ పత్రిక వార్త రావడంతో ఆ వార్తను ఉద్దేశిస్తూ ప్రశాంత్ కిషోర్ మాట్లాడారు. తనకు మీడియా అంటే ఎంతో గౌరవం ఉందని, ఇలాంటి వార్తల గురించి విన్నప్పుడు చాలా బాధగా అనిపిస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...‘నిజం చెప్పాలంటే ఈ మధ్య నేను ఎక్కడ పనిచేస్తున్నానో నాకంటే బాగా మీడియాకే తెలుస్తోంది. నేనెక్కడ పని చేస్తున్నానో నేనే వార్తా పత్రికల్లో చదవి తెలుసుకోవాల్సి వస్తోంది' అని చాలా వ్యంగ్యంగా పోస్ట్ పెట్టారు. మీడియా పట్ల తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications