Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రకాశ్ రాజ్ ట్వీట్ కలకలం - బీజేపీ నేతల ఫైర్..!!

జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాశ్ రాజ్ కొత్త వివాదానికి కారణమయ్యారు. ప్రధాని మోదీతో సహా మరో ఇద్దరు మోడీ ఫొటోలతో ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్ ఇప్పుడు వివాదంగా మారుతోంది. రాజకీయ రచ్చకు కారణమైంది. ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్ పైన బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు. అటు రాహుల్ గాంధీ పైన అనర్హత వేటుతో జాతీయ స్థాయిలో బీజేపీ వర్సస్ ప్రతిపక్షాలు అన్నట్లుగా రాజకీయం మారింది. దేశ వ్యాప్తంగా సత్యా గ్రహ దీక్షలకు కాంగ్రెస్ సిద్దమైంది. రాహుల్ వ్యాఖ్యలను..ప్రతిపక్షాల మద్దతును బీజేపీ తప్పు బడుతోంది. ఈ సమయంలో ప్రకాశ్ రాజ్ ట్వీట్ వైరల్ అవుతోంది.

ప్రకాశ్ రాజ్ మరోసారి వార్తల్లో నిలిచారు. బీజేపీ పైన తరచూ వ్యతిరేక వ్యాఖ్యలు చేసే ప్రకాశ్ రాజ్ ఇప్పుడు చేసిన ట్వీట్ చర్చకు కారణమైంది. తన ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్టింగ్ చేసారు. జనరల్ నాలెడ్జ్ అని పోస్టు చేసిన ప్రకాశ్ రాజ్.. మూడు ఫొటోలు జత చేసారు. ఇందులో కామన్ అంశం ఏంటని ప్రశ్నించారు. లలిత్‌మోడీ, నరేంద్రమోడీ, నీరవ్‌మోడీ ఫొటోలతో ఈ ప్రశ్న సంధించారు. రాహుల్ కామెంట్స్ ను పరోక్షంగా గుర్తు చేస్తూ ప్రకాశ్ రాజ్ ఈ ట్వీట్ చేసినట్లు కనిపిస్తోంది. దేశ వ్యాప్తంగా రాహుల్ కామెంట్స్.. కోర్టు తీర్పు..అనర్హత చర్చ వేళ ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

Prakash Raj Contorevsial Tweet goes viral, BJP leaders counter Attack

ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్ పైన బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్వీట్ కు ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి స్పందించారు. ప్రకాశ్ రాజ్ కు సమాధానంగా ట్వీట్ చేసారు. లలిత్‌మోడీ, నీరవ్‌మోడీ ఇద్దరూ కూడా కాంగ్రెస్‌ హయాంలోనే స్కామ్‌లు చేశారన్న సంగతి మర్చిపోవద్దని గుర్తుచేశారు. ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్‌ అరాచకాలను ఎదుర్కొని దేశం గర్వించదగ్గ నేతగా ఎదిగారని, ఈ మూడింటిలో కామన్‌గా ఉన్నది కాంగ్రెస్‌ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇదే సమయంలో రాహుల్ పై అనర్హత వేటుకు నిరసనగా కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా సత్యాగ్రహ దీక్షకు నిర్ణయించింది.

దేశం - ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తాను మాట్లాడుతూనే ఉంటానని రాహుల్ స్పష్టం చేసారు. తనను జైలుకు పంపినా వెనక్కు తగ్గేది లేదన్నారు. తాను క్షమాపణ చెప్పటానికి సావర్కర్ కాదని..తన పేరులోనే గాంధీ ఉందని వ్యాఖ్యానించారు. ఆదానీ వ్యవహారం సైడ్ చేయటానికి బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. నేడు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ దీక్షలకు దిగుతోంది. ఢిల్లీ రాజ్‌ఘాట్‌లో ఖర్గే, ప్రియాంక దీక్ష చేయనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ శ్రేణులు దీక్షలకు సిద్దం అయ్యాయి. ఈ సమయంలో ప్రకాశ్ రాజ్ ట్వీట్ పైన చర్చ సాగుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+