నంద్యాల ప్రజల తీర్పును గౌరవిస్తాం: రఘువీరారెడ్డి
అమరావతి: నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి చెప్పారు.
ఈ మేరకు రఘువీరారెడ్డి ప్రకటనను విడుదల చేశారు. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో తమ పార్టీని ఆదరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు రఘువీరా ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ ఎన్నిక ఫలితాలను సమీక్షించుకుని తాము ముందస్తు కార్యాచరణ వేసుకుని పనిచేస్తామని తెలిపింది. అధికారంతో సంబంధం లేకుండా తమ పార్టీ నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతుందని రఘువీరారెడ్డి చెప్పారు.

2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసే అభ్యర్థులు కూడ కొన్ని నియోజకవర్గాల్లో దొరకని పరిస్థితి నెలకొంది. కానీ, రాష్ట్రంలో నెలకొన్న పరిష్థితుల నేపథ్యంలో తమ ఉనికిని నిలుపుకొనేందుకుగాను కాంగ్రెస్ పార్టీ నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీచేసింది.
నంద్యాలలో మైనారిటీ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ బరిలో నిలిపింది. కానీ, ఆ పార్టీకి ఆశించిన ఓట్లు రాలేదు. అయితే ఏది ఏమైనా ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రకటించారు.
-
కాంగ్రెస్కు పాకిస్తాన్ సాయం? మలుపు తిరిగిన అస్సాం రాజకీయం -
అదే జరిగితే.. హన్మకొండ చౌరస్తాలో ఉరి వేసుకుంటానన్న మాజీ అసెంబ్లీ స్పీకర్ -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే!












Click it and Unblock the Notifications