రైల్లో మంటలు: మృతులు మాంసపు ముద్దల్లా మారారు
హైదరాబాద్: నాందేడ్ - బెంగళూర్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంలో మరమించిన ప్రయాణికుల మృతదేహాలు మాంసపు ముద్దల్లా మారాయి. ఎక్స్ప్రెస్ రైలు డి1 ఎసి బోగీలో ప్రయాణిస్తున్న 23 మంది మృతదేహాలు కూడా అలా మారాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఎసి బోగీలో మొత్తం 57 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో ఇద్దరు చిన్నారులు. మృతదేహాలు గుర్తు పట్టడానికి వీలు లేకుండా కాలిపోయాయి.
రైలు ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని రైల్వే అధికారులు భావిస్తున్నారు. బోగీలో మంటలు ప్రారంభం కాగానే ప్రయాణికులు లేచి, చైన్ లాగి రైలును ఆపేశారు. కొంత మంది కిందికి దిగిపోయారు. మంటలు తీవ్రం కావడంతో 23 మంది మరణించారు.

నాందేడ్ - బెంగళూర్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంలో ముగ్గురు కర్నూలు జిల్లా ఆదోనీకి చెందినవారున్నారు. వారిని బసవరాజు, సర్వమంగళం, భీమయ్యలుగా గుర్తించారు. రైలు ప్రమాదం ఘటనా స్థలాన్ని మంత్రి రఘువీరా రెడ్డి, పార్లమెంటు సభ్యుడు అనంత వెంకట్రామిరెడ్ిడ పరిశీలించారు. ప్రయాణికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
క్షతగాత్రులు, మృతుల సమాచారం రైల్వే శాఖ కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది. బెంగళూర్ హెల్ప్లైన్ - 080 2235 4108, 080 2225 9271, 080 2215 6554
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications