తలకు రూ. కోటి: ఏపీ డీజీపీకి రాంగోపాల్ వర్మ ఫిర్యాదు, చంద్రబాబు, పవన్కు సూటి ప్రశ్న
అమరావతి: సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ డీజీపీని కలిశారు. తన నరికిన వారికి కోటి రూపాయలు ఇస్తానంటూ వ్యాఖ్యలు చేసిన అమరావతి ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావుపై డీజీపీకి ఫిర్యాదు చేశారు రాంగోపాల్ వర్మ. కాగా, ఆర్జీవీ తెరకెక్కించిన 'వ్యూహం' చిత్రం డిసెంబర్ 29న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ సినిమా రిలీజ్ గురించి కొలికపూడి శ్రీనివాసరావు ఓ మీడియా ఛానల్లో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సమాజానికి తన సినిమాలతో కంటకంగా మారిన డైరెక్టర్ ఆర్జీవీ (రాంగోపాల్ వర్మ) తల నరికి వస్తే కోటి రూపాయలు బహుమతి ఇస్తానని శ్రీనివాసరావు ప్రకటించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ క్రమంలో రాంగోపాల్ వర్మ మంగళవారం ట్విట్టర్ వేదికగా ఆ వీడియోను జత చేసి ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఈ విషయంపై ఆర్జీవీ బుధవారం ఏపీ డీజీపీ కార్యాలయానికి వెళ్లారు.

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కొలికపూడి శ్రీనివాసరావుపై డీజీపీకి ఆర్జీవీ ఫిర్యాదు చేశారు. తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఆర్జీవీ మాట్లాడుతూ.. ఒక టీవీ డిబేట్లో కొలికపూడి శ్రీనివాస్ నన్ను చంపడానికి సుపారి ఇచ్చారు. ఆ డిబేట్ని కొనసాగించింది అంటే అది యాజమాన్యం తప్పు. ఆ మాటలు తప్పు అని కూడా ఎవరూ ఖండించలేదు. ఎప్పుడూ నన్ను చంపడానికి ఎవరూ సుపారి ఇవ్వలేదు. అందుకే ఇప్పటి వరకు నేను ఫిర్యాదు చేయలేదు అని రాంగోపాల్ వర్మ తెలిపారు.
Hey @ncbn ,@naralokesh and @PawanKalyan ..Can the fact that you are not condemning this guy be taken as you endorsing him ? https://t.co/ai581FJ9Em
— Ram Gopal Varma (@RGVzoomin) December 27, 2023
అంతకుముందు ట్విట్టర్ వేదికగా ఆర్జీవీ తనదైన శైలిలో స్పందించారు. 'కొలికపూడి నన్ను చంపేందుకు కాంట్రాక్ట్ ఇచ్చాడు. యాంకర్ సాంబశివరావు అతడికి తెలివిగా సాయం చేశాడు. నా హత్యకు సంబంధించి కొలికపూడి చేసిన వ్యాఖ్యలను 3 సార్లు పునరావృతం చేసేలా వ్యవహరించాడు' అని ట్వీట్ చేశారు రాంగోపాల్ వర్మ.
Am reaching the office of DIRECTOR GENERAL of POLICE in VIJAYWADA by 3.30 pm TODAY to file a complaint against Kolikapudi Sreenivas Rao, Tv 5 anchor Sambashiva Rao and the channel owner B R Naidu ..Will disclose the contents of my complaint to all media immediately after that pic.twitter.com/GjfyX5Uz7h
— Ram Gopal Varma (@RGVzoomin) December 27, 2023
మరో ట్వీట్లో కొలికపూడి శ్రీనివాసరావుతోపాటు యాంకర్ సాంబశివరావు, సదరు ఛానెల్ యజమాని బీఆర్ నాయుడుపై ఫిర్యాదు చేయనున్నట్లు ఆర్జీవీ పేర్కొన్నారు. చివరకు నిర్మాత దాసరి కిరణ్ కుమార్ తో కలిసి బుధవారం సాయంత్రం విజయవాడలోని డీజీపీ ఆఫీసుకు వెళ్లి.. కొలికపూడి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. మరోవైపు, కొలికపూడి వ్యాఖ్యలను చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఖండించలేదని.. అతని వ్యాఖ్యలకు మీరు సానుకూలమా? అని ప్రశ్నించారు వర్మ.
కాగా, వ్యూహం సినిమాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో రంగం ఫేమ్ అజ్మల్ నటించారు. 2009లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత నుంచి వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రి అయ్యే వరకు జరిగిన చాలా విషయాలను ఈ సినిమాలో ఆర్జీవీ చూపించారు. అయితే, ఈ సినిమాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాత్రలను అభ్యంతకరంగా చిత్రీకరించారని టీడీపీ, జనసేన అభిమానులు మండిపడుతున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications