సెక్షన్8 కోసం ఢిల్లీలో: రామ్మోహన్ నాయుడు, మంత్రి ఆస్తులపై పిటిషన్ ఉపసంహరణ
న్యూఢిల్లీ: హైదరాబాదులోని సీమాంధ్రుల రక్షణ కోసమే తాము సెక్షన్ 8 డిమాండ్ చేస్తున్నామని తెలుగుదేశం పార్టీ యువనేత, ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు సోమవారం నాడు ఢిల్లీలో చెప్పారు. సెక్షన్ 8 అమలు చేయాల్సిందేనని చెప్పారు.
ఈ అంశాన్ని పార్లమెంటు సమావేశాల్లో తాము లేవనెత్తుతామని చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలో విభజన కోసం రూపొందించిన చట్టంలో అంతర్భాగమైన సెక్షన్ 8 అమలులో తెలంగాణ ప్రభుత్వానికి అభ్యంతరాలు ఎందుకో చెప్పాలని ప్రశ్నించారు.
సీమాంధ్రుల రక్షణకే తాము సెక్షన్ 8 డిమాండ్ చేస్తున్నామని, ఇదే విషయాన్ని తాము కేంద్రం దృష్టికి తీసుకు వెళ్తామని చెప్పారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని మాట్లాడుకోవాలని ఆయన హితవు పలికారు.

మంత్రి నారాయణ ఆస్తులపై పిటిషన్ ఉపసంహరణ
ఏపీ మంత్రి నారాయణ ఆస్తుల పైన సీబీఐ విచారణ జరిపించాలంటూ ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది దానిని ఉపసంహరించుకున్నారు. పిటిషన్ ఈ రోజు విచారణకు వచ్చింది. ఉపసంహరించుకుంటారా? లేదా కొట్టివేయాలా? అని జడ్జి ప్రశ్నించగా.. ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications