ఏపీ టెన్త్ క్లాస్ పరీక్ష ఫలితాల్లో అరుదైన రికార్డు.. 600/600 మార్కులు
ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి ఫలితాల్లో ఓ విద్యార్థిని అరుదైన ఘనత సాధించింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏకంగా 600కి 600 మార్కులు పొందింది.
దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కాకినాడకు చెందిన నేహాంజని అనే బాలికకు స్థానికంగా ఉన్న భాష్యం పాఠశాలలో బాలిక చదువుతోంది. 600/600 మార్కులు సాధించింది. దీంతో ఆ విద్యార్ధినిపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

మరోవైపు ఎలమంచిలి లోని చైతన్య స్కూల్లో చదువుతున్న ఎండ అనిత అనే విద్యార్థిని 599 మార్కులు సాధించింది. అదే విధంగా పల్నాడు జిల్లా ఒప్పిచర్ల జడ్పీ హైస్కూల్లో చదువుతున్న పావని చంద్రికకు 598 మార్కులు వచ్చాయి. దీంతో ఆమెను కూడా హెచ్ఎం విజయ లలిత, తోటి ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు.

ఈ ఫలితాల్లో 81.14 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వీరిలో అబ్బాయిలు 78.31 శాతం, అమ్మాయిలు 84.09 శాతం ఉత్తీర్ణులయ్యారు. అలాగే 1,680 స్కూళ్లలో వంద శాతం ఉత్తీర్ణత నమోదైంది. 19 స్కూళ్లలో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదు కాగా... పార్వతీపురం మన్యం జిల్లాలో అత్యధికంగా 93.90 శాతం ఉత్తీర్ణత నమోదైంది. సప్లిమెంటరీ పరీక్షలు మే 19వ తేదీ నుంచి 28 వరకు నిర్వహించనున్నారు. అలానే ఏపీలోని 1,680 స్కూళ్లలో వంద శాతం ఉత్తీర్ణత నమోదవ్వగా.. 19 స్కూళ్లలో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదైంది.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications