రియల్ హీరోస్ వీళ్లే.. 10 మందిని కాపాడి, ఆరుగురిని ఆస్పత్రికి !!
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంతో ఎన్నో కుటుంబాలు తీరని శోకంలో మునిగిపోయాయి. ఈ దారుణ ఘటనలో ఒక బైకర్తో సహా 20 మందికి ప్రాణాలు కోల్పోగా మరికొందరు తీవ్ర గాయాల పాలయ్యారు. స్వల్ప గాయాలతో బయటపడ్డ 12 మందికి కర్నూలు సర్వజన ఆసుపత్రిలో తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా బస్సు రాత్రి 10 గంటలకి హైదరాబాద్ నుంచి బయలుదేరింది. తెల్లవారుజామున 2:14కి తెలంగాణ సరిహద్దులోని పులూరు టోల్ ప్లాజా చేరింది. 3:30 ప్రాంతంలో కర్నూలు సమీపంలోని చిన్నటేకూరు వద్ద ప్రమాదం జరిగింది. బస్సు బైక్ను ఢీ కొట్టి దాదాపు 300 మీటర్లు లాక్కెళ్లింది. ఆ క్రమంలోనే మంటలు చెలరేగి ఈ ఘోరం జరిగింది. అయితే బస్సులో ఉన్న వందలాది మొబైల్ ఫోన్ల పార్సిల్ ఈ ప్రమాద తీవ్రతను పెంచినట్లు గుర్తించారు.

బాధితులను ఆదుకున్న రియల్ హీరోలు వీళ్లే..
అయితే ఈ దుర్ఘటనలో శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన హరీశ్కుమార్రాజు సమయస్ఫూర్తితో స్పందించి పది మంది ప్రాణాలు కాపాడారు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న ఈ యువకుడు హైదరాబాద్ వెళ్లి తిరిగి గురువారం రాత్రి స్నేహితులతో కలిసి కారులో బెంగళూరుకు బయలుదేరారు. ఆ సమయంలోనే బస్సు ప్రమాదాన్ని గమనించి రాయితో కుడివైపు అద్దాన్ని పగులగొట్టారు. ఆ విధంగా బస్సు లోపల ఉన్న పదిమంది ప్రయాణికులు బయటకు రాగలిగారని తెలిపారు.
అలానే బస్సు నుంచి బయటపడిన వారిలో ఆరుగురికి గాయాలు కావడంతో హరీశ్ తన స్నేహితుల సహకారంతో అటుగా వస్తున్న ఓ కారు యజమానిని ఆపారు. సదరు కారు డ్రైవరు నవీన్ నంద్యాలకు వెళుతూ ప్రమాదాన్ని గమనించి కారును ఆపినట్టు తెలుస్తోంది. ప్రయాణికులను రక్షించేందుకు తనవంతు కృషిగా.. బయటపడిన వారిలో తీవ్ర అస్వస్థతకు ఆరుగురిని తన వాహనంలో ఎక్కించుకుని హుటాహుటిన కర్నూలు సర్వజన ఆస్పత్రికి తరలించి వారి ప్రాణాలు కాపాడారు.

వీరితో పాటు మరో ప్రత్యక్ష సాక్షి అటుగా వెళ్తూ ప్రమాదానికి సంబంధించిన వీడియోను తీసి పోలీసులకు సమాచారం ఇచ్చింది. తాను పుట్టపర్తి నుంచి హైదరాబాద్ వెళ్తూ ఈ ప్రమాదాన్ని చూశానని.. బస్సు మంటల్లో కాలిపోతుండగా.. కొందరు బయటకు దూకారన్నారు. సీట్లలో మానవ ముద్దలు, అస్థిపంజరాలు కనిపించాయని.. అది చూసి తట్టుకోలేకపోయానని వాపోయారు.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications