బాబుపై రోజా, 'బాబును అవమానిస్తే అందరికీ అవమానమే, కానీ'
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా శాసన సభ్యురాలు రోజా గురువారం నాడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అవినీతికి ప్యాంట్, చొక్కా వేస్తే అది చంద్రబాబేనని ఎద్దేవా చేశారు.
ఆమె తిరుపతిలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు అవినీతి వల్ల రాష్ట్రాల్లో పరువుపోయిందన్నారు. ఇతర రాష్ట్రాల్లో తెలుగువాళ్లు తల ఎత్తుకొని తిరగకుండా చేశారన్నారు. సొంత జిల్లాకు తాగు, సాగునీరు ఇవ్వని చంద్రబాబు చిత్తూరు జిల్లా పరువు తీశారన్నారు.
చంద్రబాబు ప్రజాభిమానం కోల్పోయారని వైసీపీ నేత విజయ సాయి రెడ్డి అన్నారు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీకి ఇరవై సీట్లు కూడా రావన్నారు. గత 9 ఏళ్లలో చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని, ఈసారి ఏడాదికే భ్రష్టు పట్టిందన్నారు.
'5 కోట్ల ఏపీ ప్రజలకు అవమానమే కానీ!'

ఆధారాలు లేకుంటే కనుక, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫోన్ ట్యాపింగ్ చేయడం, ఆయన పైన ఆరోపణలు చేయడం కేవలం ఆయనను మాత్రమే అవమానించినట్లు కాదనీ, ఐదు కోట్ల మంది ఏపీ ప్రజలను అవమానించినట్లేననే వాదనలు వినిపిస్తున్నాయి.
గురువారం ఉదయం యలమంచిలి శివాజీ ఓ టీవీ ఛానల్తో మాట్లాడారు. ఏపీ ప్రతినిధి అయిన చంద్రబాబును అవమానిస్తే అది ఏపీని అవమానించినట్లేనని, అయితే తప్పు చేస్తే ఎవరినైనా శిక్షించాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు.
చంద్రబాబు పైన తమ వద్ద ఆధారాలున్నాయని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో ఆధారాలుంటే, ఆయన నిజంగానే తప్పు చేస్తే అందుకు శిక్షపడాల్సిందేనని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కానీ, ఉద్దేశ్యపూర్వకంగా అలాంటి ఆరోపణలు చేస్తే మాత్రం ఏపీని కూడా అవమానించినట్లేనని అంటున్నారు.
-
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా












Click it and Unblock the Notifications