జగన్పై దాడి కుట్రే, ఇవి చాలవా? శ్రీనివాస్ రూ.కోటితో భూమి బేరమాడాడు: రోజా ఆరోపణలు
తిరుపతి: ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి ఘటన టీడీపీ కుట్రేనని ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా.. అనంతరం మీడియాతో మాట్లాడారు.
Recommended Video


రూ. కోటితో భూమి బేరం చేసిన శ్రీనివాస్..
జగన్పై దాడికి పాల్పడిన శ్రీనివాస్ కోటి రూపాయలతో భూమి కొనుగోలు చేసేందుకు బేరసారాలు ఆడాడని రోజా తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని అన్నారు. టీడీపీ నేతలు వెంటనే తమ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

శివాజీ పారిపోయాడు.. కుట్రకు నిదర్శనాలివే..
సినీ నటుడు శివాజీ పథకం ప్రకారమే అమెరికాకు పారిపోయాడని రోజా ఆరోపించారు. ముఖ్యమంత్రి, మంత్రుల తీరు చూస్తుంటే వెగటు వస్తోందని అన్నారు. ప్రజలకు రక్షణ కల్పించలేకపోతున్న నేతలు దాడికి గురైన వారిపైనే వెటకారంగా మాట్లాడటం సరికాదన్నారు. జగన్పై దాడి జరిగిన గంటలోనే నిందితుడు జగన్ అభిమాని అని డీజీపీ చెప్పడం, ఫ్లెక్సీని విడుదల చేయడం దాడి వెనుక కుట్ర ఉన్నట్లు స్పష్టమవుతోందని రోజా అన్నారు.

జగన్పై దాడి కేసు విచారణ వాయిదా..
వైయస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన హత్యయత్నం కేసు దర్యాప్తు బాధ్యతలను స్వతంత్ర సంస్థకు అప్పగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ బుధవారానికి వాయిదా పడింది. ఈ మేరకు జస్టిస్ ఆకుల వెంకటశేషసాయి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. విమానాశ్రయంలో భద్రతా లోపాలవల్లే జగన్పై హత్యాయత్నం జరిగిందని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిల్ మంగళవారం ధర్మాసనం ముందు విచారణకు రానున్న నేపథ్యంలో, స్వతంత్ర సంస్థ దర్యాప్తు కోసం తన ముందు దాఖలైన వ్యాజ్యంపై బుధవారం విచారణ జరుపుతానని జడ్జి తెలిపారు.

రక్షణ లేదంటూ.. గవర్నర్కు బీజేపీ నేతల ఫిర్యాదు
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై వినతిపత్రం ఇచ్చేందుకు సోమవారం హైదరాబాద్లోని రాజ్భవన్కు వెళ్లిన బీజేపీ నాయకులు.. జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం, తదనంతర పరిణామాలపై గవర్నర్తో చర్చించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా ఉందని.. అన్ని ప్రతిపక్ష పార్టీల అగ్రనేతలపై దాడులు జరుగుతున్నాయని గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా, రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణలపై దాడి జరిగిందని, జగన్పై హత్యాప్రయత్నం జరిగిందని వివరించారు. ప్రతిపక్ష నాయకుడిపై హత్యాప్రయత్నం జరిగితే గవర్నర్ రాష్ట్ర డీజీపీని వివరాలు కోరడాన్ని కూడా ముఖ్యమంత్రి తప్పుబట్టడాన్ని బీజేపీ నేతలు ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి, నేతలపై దాడుల విషయంలో సీబీఐతో విచారణ జరిపించాలని గవర్నర్ను వారు కోరారు.
-
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications