కాల్మనీ: అనారోగ్యం పేరిట ఎస్కేప్, ఆసుపత్రిలో దొరికిపోయాడు
అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్మనీ కేసులో నిందితుడిగా ఉన్న మాధంశెట్టి శివకుమార్ ఈ కేసు నుంచి బయటపడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. కాల్మనీ కేసులో మాధంశెట్టి శివకుమార్ను ఇటీవలే పోలీసులు అరెస్టు చేశారు.
సోమవారం అతడిని కోర్టు ముందు హాజరుపరచగా రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో శివను జైలుకు తరలిస్తుండగా జైలు ప్రాంగణానికి సమీపంలో తనకు అనారోగ్యంగా ఉందని చెబుతూ ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. దీంతో చేసేదేమిలేక పోలీసులు అతడిని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

అయితే ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఈ కేసు నుంచి బయటపడేందుకు మాధంశెట్టి శివకుమార్ ప్రయత్నిస్తున్నాడని డీపీసీ కాళిదాసు రంగారావుకు అనుమానం వచ్చింది. దీంతో ఈరోజు సాయంత్రం ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. మాధంశెట్టి శివకుమార్ ఉన్న గదిలో వెళ్లి చూడగానే అవాక్కయ్యారు.
మాధంశెట్టి శివకుమార్ దర్జాగా, ఆరోగ్యంగా తిరుగుతూ ఉన్నట్లు ఆయన గమనించారు. ఈ విషయాన్ని ఆసుపత్రి వైద్యులకు చెప్పడంతో మళ్లీ వైద్య పరీక్షలు నిర్వహించారు. శివకుమార్కు ఎలాంటి అనారోగ్యం లేదని వైద్యపరీక్షల్లో తేలడంతో అతడిని అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు.
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన












Click it and Unblock the Notifications