ఆగస్ట్ 2 నుంచి రెండు రాష్ట్రాల్లో ఆర్టీసి సమ్మె: ఈయు
హైదరాబాద్: ఆగస్టు 2 నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోనూ ఆర్టీసి కార్మికులు సమ్మె చేయనున్నట్లు ఈయు నాయకులు ప్రకటించారు. గురువారం బస్ భవన్లో ఆర్టీసి యాజమాన్యం కార్మికులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి.
సొసైటీ బకాయిలు చెల్లించలేమని యాజమాన్యం తేల్చిచెప్పింది. ఆర్టీసి యాజమాన్యం సొసైటీకి రూ. 250 కోట్లు బకాయి పడింది. సొసైటీ డబ్బును వాడుకోవడంపై కార్మికులు అధికారులను నిలదీశారు. చర్చల జరుగుతున్న సమయంలోనే ఆర్టీసి ఈయు నేతలు బయటకు వచ్చేశారు. ఆగస్టు 2 నుంచి సమ్మె చేయనున్నట్లు ప్రకటించారు.

సొసైటీ బకాయిలు చెల్లించలేమని యాజమాన్యం తేల్చి చెప్పడంతో తాము సమ్మె చేసేందుకు నిర్ణయించినట్లు ఈయు నాయకులు తెలిపారు.
అంతకుముందు ఈ వ్యవహారంపై ఇరు రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులను కలిసినప్పటికీ వారి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఇరు రాష్ట్రాల్లో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు నిరసనలకు కార్యక్రమాలు చేపట్టారు. దీంతో దిగివచ్చిన ఆర్టీసీ యాజమాన్యం కార్మక సంఘాల నేతలను చర్చలకు ఆహ్వానించింది. అయితే చర్చలు విఫలమైన నేపథ్యంలో ఆగస్టు 2 నుంచి సమ్మెకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications