స్కూల్ బస్సు డ్రైవర్: 20 మందిని కాపాడి ప్రాణాలు వదిలాడు
ఒంగోలు: ఓ రోడ్డు ప్రమాద ఘటనలో పాఠశాల బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి 20 మంది ప్రాణాలు కాపాడాడు. తాను మాత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణిచాడు. ఈ సంఘటన సోమవారంనాడు ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో జరిగింది.
ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడిన బస్సు డ్రైవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ముగ్గురు చిన్నారులకు స్వల్పంగా గాయాలయ్యాయి. ఒంగోలు క్రౌపేటలోని సెయింట్ మేరీస్ పాఠాశాలకు చెందిన బస్సు సోమవారం ఉదయం 20 మంది పిల్లలతో త్రోవగుంట నుంచి బయలుదేరింది.

త్రోవగుంట వద్ద జాతీయ రహదారిపై అదుపు తప్పిన బస్సు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఆ తర్వాత రోడ్డు పక్కనే ఉన్న భారీ నీటి గుంటలో పడింది. ఈ ఘటనలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు.
తమ పిల్లలకు పెను ప్రమాదం తప్పడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంలో గాయపడినవారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ మాత్రం ప్రాణాలు వదిలాడు.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications