స్కూల్ బస్సు డ్రైవర్: 20 మందిని కాపాడి ప్రాణాలు వదిలాడు
ఒంగోలు: ఓ రోడ్డు ప్రమాద ఘటనలో పాఠశాల బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి 20 మంది ప్రాణాలు కాపాడాడు. తాను మాత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణిచాడు. ఈ సంఘటన సోమవారంనాడు ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో జరిగింది.
ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడిన బస్సు డ్రైవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ముగ్గురు చిన్నారులకు స్వల్పంగా గాయాలయ్యాయి. ఒంగోలు క్రౌపేటలోని సెయింట్ మేరీస్ పాఠాశాలకు చెందిన బస్సు సోమవారం ఉదయం 20 మంది పిల్లలతో త్రోవగుంట నుంచి బయలుదేరింది.

త్రోవగుంట వద్ద జాతీయ రహదారిపై అదుపు తప్పిన బస్సు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఆ తర్వాత రోడ్డు పక్కనే ఉన్న భారీ నీటి గుంటలో పడింది. ఈ ఘటనలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు.
తమ పిల్లలకు పెను ప్రమాదం తప్పడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంలో గాయపడినవారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ మాత్రం ప్రాణాలు వదిలాడు.












Click it and Unblock the Notifications