ఆచూకీ దొరకని విమానం: కన్నీరు మున్నీరవుతున్న విశాఖవాసులు
విశాఖపట్నం: చెన్నై నుంచి పోర్టు బ్లెయిర్కు వెళ్తూ అదృశ్యమైన వాయుసేన విమానం (ఎఎన్ 32) ఆచూకీ శనివారం సాయంత్రానికి కూడా లభించలేదు. విశాఖకు చెందిన ఎనిమిది మంది విధి నిర్వహణలో భాగంగా బుధవారమే విశాఖ నుంచి బయలుదేరారు. గురువారం చెన్నై చేరుకున్నారు.
శుక్రవారం ఉదయం వాయుసేన విమానంలో వీరంతా పోర్టు బ్లెయిర్కు బయలుదేరారు. అయితే, వీరు ప్రయాణిస్తున్న విమానం గల్లంతైన విషయం ఎన్ఎడి అధికారుల ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దీంతో వారు పెను విషాదంలో మునిగిపోయారు.

విశాఖ నగరం గోపాలపట్నం, అప్పన్నపాలెం, బుచ్చిరాజుపాలెం, వేపగుంట ప్రాంతాలకు చెందిన వీరు ఈ నెల 20న విధి నిర్వహణలో భాగంగా పోర్టు బ్లెయిర్కు బయలుదేరారు. విమానం గల్లంతైందనే సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునగిపోయారు.
కాగా, రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరికర్ శనివారంనాడు చెన్నై చేరుకున్నారు. నావిక, వైమానిక దళాలు, కోస్ట్ గార్డులు చేపట్టిన గాలింపు చర్యలపై ఆయన వివరించారు. ఆచూకీ తీయడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన ట్వీట్ చేశారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications