శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

AOBలో తప్పిన పెనుముప్పు- మావోయిస్టుల దుశ్చర్యకు బ్రేక్-భద్రతాదళాలు సేఫ్‌

|
Google Oneindia TeluguNews

మావోయిస్టు కార్యకలాపాలు ఎక్కువగా ఉన్న ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో కొంతకాలంగా పోలీసులు భారీగా కూంబింగ్ చేపడుతున్నారు. తాజాగా పలువురు మావోయిస్టులు కరోనా బారిన పడటం, ఇతరత్రా కారణాలతో ఇదే అదనుగా బీఎస్ఎప్‌తో పాటు ఒడిశా పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్‌ చేపడుతున్నారు. దీన్ని అడ్డుకునేందుకు మావోయిస్టులు పలుచోట్ల మందుపాతరలు అమర్చారు.

ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో ఇలా అమర్చిన రెండు మందుపాతరలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశాయి. రహదారి కింద అమర్చిన ఈ మందుపాతరలను విజయవంతంగా గుర్తించి నిర్వీర్యం చేయడంతో భద్రతా బలగాలకు పెనుముప్పు తప్పింది. భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌ను ల‌క్ష్యంగా చేసుకుని ఆంద్రా-ఒడిశా స‌రిహ‌ద్దుల్లో మావోయిస్టులు ఏర్పాటుచేసిన రెండు మందుపాత‌ర‌ల‌ను గాలింపు సందర్భంగా బ‌ల‌గాలు స్వాధీనం చేసుకున్నాయి.

security forces defused two landmines fixed by mavoists while coming in AOB

ఏవోబీలో మ‌ల్క‌న్‌గిరి జిల్లా జొడొంబో పోలీసుస్టేష‌న్ ప‌రిధిలో జాజుపాలెం-కెందుగుడా వ‌ద్ద జ‌రుగుతున్న నిర్మాణంలో భాగంగా ర‌హ‌దారిలో ఏర్ప‌ాటు చేసిన రెండు టిఫిన్ ఐఈడీల‌ను బీఎస్ఎఫ్, ఒడిశా పోలీసులు సంయుక్తంగా స్వాధీనం చేసుకున్నారు.ఇటీవ‌ల గాలింపు చేపట్టేందుకు వ‌స్తున్న ఆంధ్రా-ఒడిశా బ‌ల‌గాల‌ను తుద‌ముట్టించ‌డానికి నిర్మాణంలో ఉన్న ర‌హ‌దారిని మావోయిస్టులు ఎంచుకుని రెండు మందుపాత‌ర‌ల‌ను ఏర్పాటు చేశారు.

వీటిపై ప‌క్కా స‌మాచారం అందుకున్న ఒడిశా పోలీసులు మ‌రియు బీ ఎస్ ఎఫ్ బ‌ల‌గాలు గాలింపు చ‌ర్య‌లు నిర్వ‌హించి మందుపాత‌ర‌ల‌ను క‌నుకున్నారు. వెంట‌నే బాంబు నిర్వీర్య బృందాల‌ను పిలిపించి మందుపాత‌ర‌లను తొల‌గించారు.ఒక్కొక్క మందుపాత‌ర 2.5 బ‌రువు ఉంద‌ని పోలీసువ‌ర్గాలు తెలిపాయి.

Recommended Video

Karanam Malleswari Has Appointed As The Vice Chancellor Of Delhi Sports University | Oneindia Telugu

English summary
security forces on today defused two landmines fixed by mavoists in andhra-odisha border.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X