చెన్నై - సంత్రగచ్చి మధ్య స్పెషల్ ట్రెయిన్: ఏపీలో ఎక్కడెక్కడ ఆగుతుందంటే..
దీపావళి, శీతాకాలం నేపథ్యంలో ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సౌత్ ఈస్టర్న్ రైల్వే వారానికి మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది.
చెన్నై: దీపావళి, శీతాకాలం నేపథ్యంలో ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సౌత్ ఈస్టర్న్ రైల్వే వారానికి మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది.
సంత్రగచ్చి - చెన్నై మధ్య వారానికి 13 జంట ట్రెయిన్స్ నడపాలని నిర్ణయించింది. 04-10-2017 నుంచి 28-12-2017 వరకు ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి.
06057 సంత్రగచ్చి - చెన్నై సెంట్రల్ స్పెషల్ రైలు ప్రతి గురువారం రాత్రి గం.11.50 నిమిషాలకు సంత్రగచ్చి నుంచి చెన్నై బయలుదేరుతుంది. అది శనివారం ఉదయం గం.5.30 నిమిషాలకు చెన్నై చేరుకుంటుంది.

మరో స్పెషల్ ట్రెయిన్ 06058 చెన్నై సెంట్రల్ నుంచి ప్రతి బుధవారం మధ్యాహ్నం గం.3.15 నిమిషాలకు బయలుదేరుతుంది. అది మరుసటి రోజు రాత్రి గం.7.00కు సంత్రగచ్చి చేరుకుంటుంది.
ఈ ప్రత్యేక రైళ్లలో రెండు ఏసీ 3 టయర్, పది స్లీపర్ కాల్స్, రెండు జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు ఉంటాయి. ఈ రైళ్లు ఖరగ్పూర్, భద్రక్, కటక్, భువనేశ్వర్, ఖుద్రా రోడ్, బ్రహ్మపుర్, విజయనగర్, విశాఖపట్నం, అనకాపల్లి, సామల్కోట్, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడుర్, స్టేషన్లలో ఆగుతుంది.












Click it and Unblock the Notifications