కుంభమేళా నుంచి తిరిగొస్తూ తిరిగిరాని లోకాలకు.. తెలంగాణ వాసులు దుర్మరణం
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కుంభమేళాకు వెళ్లి తిరిగివస్తూ.. జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. జబల్పుర్లోని సిహోరా సమీపంలో ఈరోజు ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వీరు ప్రయాణిస్తున్న మినీ బస్సును ఎదురుగా వన్ వేలో వస్తున్న ఓ ట్రక్కు బలంగా ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో ప్రమాదానికి గురైన మినీ బస్సు రిజిస్ట్రేషన్ ఏపీ అని ఉండటంతో బాధితులంతా ఆంధ్రప్రదేశ్కు చెందిన వారుగా అనుకున్నారు. అయితే మృతదేహాల వద్ద లభించిన ఆధారాల మేరకు వారిని తెలంగాణలోని నాచారం వాసులుగా పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వెంటనే అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని.. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

మరోవైపు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సైతం జబల్పూర్ కలెక్టర్ తో ఫోన్లో మాట్లాడారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆయనను వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు అన్ని విధాలుగా సహాయం చేయాలని కోరారు. మృతదేహాలకు వెంటనే పంచనామా చేసి, త్వరగా స్వస్థలాలకు త్వరగా పంపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రమాదం జరిగిన సమయంలో మినీ బస్సులో 14 మంది ఉన్నారని తెలుస్తోంది. బస్సులో ఉన్న మిగతా వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ విషాద వార్తతో మృతుల కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి. పలువురు ప్రముఖులు సైతం సోషల్ మీడియా వేదికగా వారి సానుభూతి తెలియజేస్తున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications