అది లాడ్జీ కాదు, వ్యభిచార కూపం: మహిళలతోపాటు 6గురి అరెస్ట్
చిత్తూరు: జిల్లాలోని మదనపల్లె పట్టణ నడిబొడ్డున సాగుతున్న సెక్స్ రాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. పట్టణంలో ఉన్న లాడ్జీపై దాడి చేసి, వ్యభిచార ముఠాను అరెస్టు చేశారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలను రెండోపట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ హనుమంతునాయక్ వెల్లడించారు. మదనపల్లెలోని చిత్తూరు బస్టాండు వద్ద ఉన్న ఓ లాడ్జీలో వ్యభిచారం జరుగుతోందని తమకు సమాచారం వచ్చిందన్నారు. దీంతో జరిపిన దాడుల్లో లాడ్జీ రూంబాయ్గా పనిచేస్తున్న వ్యక్తి (39) లాడ్జీలో వ్యభిచారం చేయిస్తున్నారని తేలిందన్నారు.

ఇతనితో పాటు బి.కొత్తకోట మండలం పెద్దపల్లెకు చెందిన విటుడు(27)తో పాటు బస్టాండుకు వచ్చే మహిళలను, యువతులను ట్రాప్ చేసి వ్యభిచారంలోకి దింపే ఎస్టేట్కు చెందిన నలుగురు మహిళలను అరెస్టు చేశామన్నారు. వీరి వద్ద నుంచి రూ.2,200 నగదు స్వాధీనం చేసుకుని రిమాండుకు తరలించినట్లు ఆయన వివరించారు.
చిత్తూరు సమీపంలోని అడవిపల్లెకు చెందిన లాడ్జీ యజమాని కుమారుడు పరారీలో ఉన్నాడని తెలిపారు. అతనిపై కూడా కేసు నమోదు చేశామని వివరించారు. నిందితుడ్ని త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications