వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు పాత మిత్రుడు, అందుకే కలిశా: శంకర రావు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును మాజీ మంత్రి, కంటోన్మెంట్ శాసన సభ్యుడు శంకర రావు సోమవారం ఉదయం కలిశారు. ఆసుపత్రిలో ఉన్న బాబును పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.

ఈ వయసులో ఐదు రోజుల పాటు దీక్ష చేయడం వల్లే బాబుకు సమస్యలు తలెత్తాయని చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తనకు పాతమిత్రుడని, మానవతాదృక్పథంతోనే బాబును కలిశానన్నారు. దీనికి రాజకీయాలతో సంబంధంలేదని చెప్పారు.

Shankar Rao

కాగా, తెలుగు జాతికి న్యాయం చేయాలంటూ దీక్ష చేసి ఆసుపత్రిలో చికిత్స పొందిన బాబుకు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పరామర్శించిన విషయం తెలిసిందే. బాబు యోగక్షేమాల గురించి ఫోన్ చేసి ఆరా తీశారు. ఢిల్లీ ఆంధ్రాభవన్‌లో ఆరు రోజులు దీక్ష చేసినా, బిజెపికి చెందిన ఏ ఒక్కరూ బాబును నేరుగా వచ్చి పరామర్శించలేదు.

ఈ నేపథ్యంలో చంద్రబాబుకు మోదీ పలకరింపు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏడు రోజులుగా బాబు దీక్ష చేస్తున్న విషయం తెలుసుకున్న మోడీ... ఈ వయసులో ఇంత తెగింపు వద్దని, ఆరోగ్యం కాపాడుకోవాలని, మీలాంటి నాయకులు దేశానికి అవసరమని హితవు చెప్పారు.

English summary
Former Minister Shankar Rao met TDP chief Nara Chandrababu Naidu in Hyderabad hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X