జగన్ను కల్సిన షర్మిల, దీక్ష భగ్నం దురదృష్టం: అంబటి
జగన్ సతీమణి వైయస్ భారతి కూడా ఆయనను కలిశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... జగన్కు రాత్రి ఫ్లూయిడ్స్ ఎక్కించారని చెప్పారు. రక్త పరీక్షల కోసం మరోసారి బ్లడ్ శాంపిల్ తీసుకున్నారన్నారు.
దేశ భద్రత గురించి తెలియదు: అంబటి
తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి దీక్షను భగ్నం చేయడం దురదృష్టకరమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వేరుగా అన్నారు. రాష్ట్రాన్ని విభజించాలనుకుంటున్న ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి దేశభద్రత గురించి ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎందుకు దీక్ష చేస్తన్నారో స్పష్టత లేదని, ఆయన ఢిల్లీలో ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.
ఎపి భవన్.. ఆంధ్ర భవన్గా: దేవిప్రసాద్
బాబు దీక్ష చేయడం తెలంగాణ ప్రజలను అవమానించడమేనని టిఎన్జీవో నేత దేవిప్రసాద్ కరీంనగర్లో అన్నారు. ఎపి భవన్ ఆంధ్రా భవన్గా మారిందన్నారు. రాష్ట్రంలో పరిపాలనకు పక్షవాతం వచ్చిందని, కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. జివోఎం కమిటీ అస్పష్టంగా ఉందన్నారు. నివేదికకు నిర్ణీత గడువు విధించాలని, మాజీ డిజిపి దినేష్ రెడ్డి వ్యాఖ్యల పైన న్యాయవిచారణ జరిపించాలన్నారు.