మిథున్ రెడ్డికి బిగ్ ఝలక్- బెయిల్ రద్దు దిశగా?
మద్యం కేసు నుంచి బెయిల్ పై విడుదల అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, లోక్ సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి మరో భారీ షాక్ తగిలింది. ఆయనకు చెందిన నివాసాలు, కార్యాలయాల్లో ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు సోదాలు చేపట్టారు. ఈ ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, బెంగళూరుల్లో మిథున్ రెడ్డికి సంబంధించిన అన్ని కార్యాలయాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోన్నారు.
మొత్తం నాలుగు బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు ఆయా కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులు, ఇతర సిబ్బందిని కూడా అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా కొన్ని కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు గానీ దీన్ని ఎవరూ అధికారికంగా ధృవీకరించట్లేదు. లిక్కర్ కేసు దర్యాప్తులో భాగంగానే ఈ సోదాలు నిర్వహిస్తోన్నట్లు సమాచారం.

ఏపీ లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి ఏ4గా ఉన్న విషయం తెలిసిందే. గతంలో ఆయన అరెస్ట్ అయ్యారు కూడా. 71 రోజుల పాటు జ్యూడీషియల్ కస్టడీ తర్వాత ఇటీవలే రాజమండ్రి కేంద్ర కారాగారం నుంచి బెయిల్ పై విడుదల అయ్యారు. పార్టీ కార్యకలాపాల్లో క్రియాశీలకంగా పాల్గొంటోన్నారు. ఆయన బెయిల్ పై విడుదల అయిన తర్వాత.. పార్టీ అనంతపురం, శ్రీసత్యసాయి, నెల్లూరు జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ రీ అపాయింట్ అయ్యారు.
దీంతో ఆయా జిల్లాల నాయకులతో తిరుపతిలోని తన నివాసంలో తరచూ సమావేశాలను నిర్వహిస్తూ వస్తోన్నారు. పూర్తిస్థాయిలో పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారించారు. త్వరలో అనంతపురం, శ్రీసత్యసాయి, నెల్లూరు జిల్లాల పార్టీ నాయకులతో సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ మూడు జిల్లాలకు చెందిన అధ్యక్షులు, అసెంబ్లీ/లోక్ సభ నియోజకవర్గాల ఇన్ ఛార్జీలతో సమావేశం కానున్నారు. త్వరలో ఆయా జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అదే కాకుండా- ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాలకు ప్రాతినిథ్యాన్ని వహించే పార్లమెంటరీ ప్రతినిధి బృందంలో ఆయనకు చోటు దక్కింది. త్వరలోనే ఆయన ఈ బృందంతో కలిసి అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్ళనున్నారు. తెలుగుదేశం- జనసేన కూటమికి చెందిన ఎంపీలను కాదని కేంద్ర ప్రభుత్వం మిథున్ రెడ్డిని ఎంపిక చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఈ పరిస్థితుల మధ్య మిథున్ రెడ్డి మరోసారి సిట్ రాడార్ లోకి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!!












Click it and Unblock the Notifications