బూమ్ బూమ్ బీర్ కంపెనీల అసలు మ్యాటర్ లీక్ ?, చిత్రవిచిత్ర బ్రాండ్లు, సిట్ చేతిలో చరిత్ర?
ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి ఇంటిలో సీఐడీ సోదాలు చెయ్యడంతో ఇంతకాలం పలు బ్రాండ్ల పేరుతో ఆంధ్రప్రదేశ్ లో మద్యం సరఫరా చేసిన కంపెనీల యాజమాన్యాలకు గుబులు మొదలైయ్యిందని తెలిసింది వాసుదేవ రెడ్డి ఇంటిలో పలు కీలక పత్రాలను సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకోవడంతో అందులో ఏముంది ? అనే విషయంపై వైసీపీ నాయకులకు దడ మొదలైయ్యిందని సమాచారం.
ఇంతకాలం ఆంధ్రప్రదేశ్ లో దేశంలో పేరు పొందిన బ్రాండ్ కంపెనీల మద్యం కాకుండా దేశంలోనే ఎక్కడా లేని చిత్రవిచిత్రమైన బ్రాండ్ల పేరుతో మద్యం విక్రయించారు. బూమ్ బూమ్ బీర్లు మొదలుకొని విస్కీ, బ్రాందీ, రమ్, జిన్ ఇలా అన్ని రకాల విచిత్రమైన బ్రాండ్ల పేరుతో మద్యం విక్రయించారు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ సీఎం కాక ముందు ఆ కంపెనీలు ఏ రాష్ట్రంలో అయినా ఇలాంటి బ్రాండ్ల మద్యం విక్రయించారా ? అని ఆరా తీయ్యాలని అధికారులు ప్రయత్నిస్తున్నారని తెలిసింది.

ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలు దేశంలోని ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో కూడా నివాసం ఉంటున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో విక్రయిస్తున్న మద్యం బ్రాండ్ల పేర్లు దేశంలో ఎక్కడా మేము వినలేదని అంటున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ మద్యం దుకాణాలకు విదేశాల నుంచి కూడా మద్యం దిగుమతి కాలేదు. ఇంక ఎక్కడి నుంచి అలాంటి లిక్కర్ కంపెనీలు పుట్టుకు వచ్చాయి అని ఆరా తియ్యాలని కూటమి నాయకులు కొందరు సంబంధిత అధికారులకు సూచించారని తెలిసింది.
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ కొలువుతీరిన తరువాత కొత్తకొత్త లిక్కర్ కంపెనీలు ప్రారంభించారా ?, ఆ కంపెనీల యజమానులు ఎవరు ?, లిక్కర్ కంపెనీల యజమానులకు వైసీపీ నాయకులకు ఏమైనా సంబందం ఉందా ?, అని అధికారులు సమాచారం సేకరిస్తోందని, ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారం స్వీకరించిన తరువాత ఆ పూర్తి సమాచారం ఇవ్వడానికి సిద్దం అవుతున్నారని తెలిసింది. మొత్తం మీద బూమ్ బూమ్ బీర్లతో పాటు పలు బ్రాండ్ల మద్యం సరఫరా చేసిన కంపెనీలకు ఇప్పుడు ఒణుకు మొదలైయ్యిందని తెలిసింది.

ఆంధ్రప్రదేశ్ లో ఇంతకాలం విక్రయించిన లిక్కర్ బ్రాండ్ల గురించి టీడీపీ, జనసేన, బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల కూడా వైసీపీ ప్రభుత్వం మీద పలు ఆరోపణలు చేశారు. మా అన్నా జగన్ ప్రేజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని, అందుకే నాసిరకం మద్యం విక్రయిస్తున్నారని ఎన్నికల ప్రచారం సమయంలో వైఎస్ షర్మిల వైఎస్ జగన్ ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications