హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టికెట్ అడిగితే మహిళా టిసిని రైలు నుంచి తోసేశారు

|
Google Oneindia TeluguNews

Some passengers pushes woman tc out of moving train
హైదరాబాద్/ప్రకాశం: నగరంలోని మదాపూర్ హఫీజ్‌పేట రైల్వేస్టేషన్‌లో దారుణం జరిగింది. టికెట్ కలెక్టర్ గీతను కొందరు దుండగులు రైలులో నుండి తోసివేశారు. గీతకు తీవ్రగాయాలు అవడంతో వెంటనే మెట్టుగూడ రైల్వే ఆస్పత్రికి తరలించారు. టికెట్ అడిగినందుకు దుండగులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు దుండగులు.

ఉదయం 9గంటల ప్రాంతంలో రైలు లింగంపల్లి నుంచి సికింద్రాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. హఫీజ్‌పేట రైల్వేస్టేషన్‌లో రైలు బయలుదేరే సమయంలో కొందరు వ్యక్తులను టికెట్ అడగగా వారు ఆమెపై దాడి చేసి రైలు నుంచి కిందకు తోసేశారు. ఈ ప్రమాదంలో గీతకు తీవ్ర గాయలయ్యాయి. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కేరళ ఎక్స్‌ప్రెస్‌లో గత జూన్ నెలలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ప్రయాణికుడికి జరిమానా రాసిన కాజీపేట రైల్వే స్క్వాడ్‌గా పని చేస్తున్న టికెట్ కలెక్టర్ విజయ్ కుమార్‌ను నలుగురు దుండగులు కదులుతున్న రైల్లో నుంచి కిందకు తోసేశారు. తీవ్రంగా గాయపడిన టిసి హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం కరేడు ర్యాంపు సమీపంలో ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఇన్నోవా కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. హైదరాబాద్ నుంచి శుక్రవారం ఉదయం నెల్లూరు జిల్లా కోళ్లమిట్ట గ్రామానికి వెళుతుండగా కరేడు క్యాంపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న నాసిన శ్రీనివాసులు(48) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన వారిన ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కారు డ్రైవర్ మృతి చెందాడు. మిగిలిన ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

English summary
Some passengers pushes woman tc out of moving train in Hyderabad for asking ticket.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X