మచిలీపట్నం, తిరుపతికి కేంద్రం వరం
మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించేందుకు భారతీయ రైల్వే కృషి చేస్తుంటుంది. దీనిలో భాగంగానే సెమీ హైస్పీడ్ రైళ్లు వందే భారత్ ను ప్రవేశపెట్టింది. అలాగే ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేస్తుంటుంది. తాజాగా తీర ప్రాంతమైన మచిలీపట్నం నుంచి ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి వరకు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈనెల తొమ్మిది, పది తేదీల్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరిన అధికారులు
మచిలీపట్నంలో రైలు నెంబరు 07249 తొమ్మిదోతేదీ రాత్రి 11.00 గంటలకు బయలుదేరి తర్వాత రోజు ఉదయం 8.35 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. అలాగే రైలు నెంబరు 07250 పదోతేదీ రాత్రి తిరుపతిలో 10.50 గంటలకు బయలుదేరి తర్వాత రోజు ఉదయానికి మచిలీపట్నం చేరుకుంటాయి. పెడన, పెడన, గుడ్లవల్లేరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, నిడుబ్రోలు, బాపట్ల, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వేస్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యం ఉంది. వీటికి సంబంధించిన రిజర్వేషన్ సౌకర్యం ప్రారంభమైంది. అవకాశాన్ని ఉపయోగించుకోవాలని డివిజన్ రైల్వే డివిజన్ అధికారులు సూచించారు.

రద్దీని నియంత్రించేందుకు
విజయవాడ నుంచి గూడూరు మధ్య ప్రస్తుతం ఉన్న డబుల్ లైను రద్దీగా ఉండటంతో దీన్ని నియంత్రించేందుకు దక్షిణ మధ్య రైల్వే మూడో లైను నిర్మాణాన్ని చేపట్టింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పనులు జరుగుతుండటంతో కొన్ని రైళ్లను రద్దు చేసింది. వాటి వివరాలను వెబ్ సైట్ లో ఉంచింది. అలాగే విజయవాడ-విశాఖపట్నం మధ్య కూడా మూడోలైను నిర్మాణ పనులు జరుగుతున్నాయి. విశాఖపట్నం నుంచి గూడూరు వరకు మూడోలైను నిర్మాణం పూర్తయితే రైళ్లను మరింత వేగంగా నడపనున్నారు. కొన్ని ప్రధానమైన రైళ్లు ముందుగా పంపించేందుకు కొన్ని రైళ్లను ఆయా స్టేషన్లలో నిలిపివేస్తారు. ఇకనుంచి ప్రయాణికులకు అటువంటి బాధ తప్పుతుంది.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం












Click it and Unblock the Notifications