జగన్కు మరో షాక్: టీడీపీలో చేరనున్న సుజయకృష్ణ రంగారావు!
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి మరో షాక్ తగలనుందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఇప్పటికే వైయస్ జగన్ పార్టీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీలో చేరగా.. తాజాగా బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు కూడా టిడిపి తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే బుధవారం సుజయకృష్ణ రంగారావు స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలతో సంప్రదింపులు జరిపారు. తాను తెలుగుదేశం పార్టీలో చేరాలని అనుకుంటున్నానని వెల్లడించిన ఆయన.. నేతల అభిప్రాయాలను కోరారు.
త్వరలోనే తాను కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి టీడీపీలోకి వస్తానని ఆయన తెలిపినట్టు సమాచారం. తనతో పాటు పెద్దఎత్తున కార్యకర్తలు సైతం పార్టీ మారుతారని రంగారావు వెల్లడించారట.

కాగా, ఇప్పటికే 11 మంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి చేరి ఆ పార్టీని కష్టాల్లోకి నెట్టేయగా.. తాజా ఫిరాయింపుల వార్తలతో ఆ పార్టీ పీకల్లోతు కష్టాల్లోకి వెళ్లినట్లయింది.
బుధవారం సాయంత్రం కార్యకర్తలు, అభిమానులతో సమావేశం ఏర్పాటు చేసి తన నిర్ణయం ప్రకటించేందుకు సుజయకృష్ణ ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలిసింది. కాగా, త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక సీటును గెలుచుకునే అవకాశాలూ అడుగంటుతున్నాయి.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications