మాజీ న్యాయమూర్తి ఎన్వీ రమణపై సీఎం జగన్ లేఖ - సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..!!
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎన్వీ రమణ పై ఏపీ సీఎం రాసిన లేఖ వ్యవహారంపై దాఖలైన పిటీషన్ సుప్రీం విచారణకు వచ్చింది. న్యాయమూర్తి పై చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యాయవాది సునీల్ కుమార్ సింగ్ సుప్రీంలో పిటీషన్ దాఖలు చేసారు.జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సుందరేశ్ లతో కూడిన ధర్మాసనం ఈ పిటీషన్ పైన విచారణ చేసింది. ఈ పిటీషన్ దాఖలు పైన జస్టిస్ షా పలు ప్రశ్నలు సంధించారు. పిటీషనర్ ఎవరు..ఎందుకు ఈ పిటీషన్ దాఖలు చేసారని ప్రశ్నించారు.
దీనికి సమాధానంగా తాను సీఎం జగన్ ప్రవర్తనను సవాల్ చేసానని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి జగన్ నాటి సుప్రీం న్యాయమూర్తి పైన చేసిన వ్యాఖ్యలతో అప్పటి సీజేఐకు లేఖ రాసిని విషయాన్ని గుర్తు చేసారు. అదే సమయంలో ఆ విషయాన్ని మీడియాకు చెప్పారని వివరించారు. అన్ని పత్రికల్లో అది వచ్చిందని నివేదించారు. అదే రోజు తాను ఈ పిటీషన్ దాఖలు చేసానని పిటీషనర్ దర్మాసనానికి తెలిపారు. ఇదే సమయంలో జోక్యం చేసుకున్న న్యాయమూర్తి షా ఈ కేసుతో గత ప్రభుత్వ నిర్ణయాల పునసమీక్ష కేసులు ఏంటి సంబంధం అని ప్రశ్నించారు.

రెండింటిని ఎందుకు కలిపారంటూ పిటీషనర్ ను సమాధానం రాబట్టారు. గతంలో విచారణకు వచ్చిన సమయంలో నాటి ధర్మానసం చేసిందని, మరో రెండు పిటీషన్లు కొట్టేసి దీనిని మనుగడలో ఉంచారని సింగ్ ధర్మాసనంకు వివరించారు. దీంతో, ముఖ్యమంత్రి చేసిన ప్రకటన ఉందా అంటూ జస్టిస్ షా ప్రశ్నించారు. లేఖ ఉందని చెప్పిన సింగ్, అందులో విషయాలను చెప్పే ప్రయత్నం చేసారు. దీంతో, వెంటనే జోక్యం చేసుకున్న ధర్మాసనం చదవద్దని సూచించింది. దీంతో, గత ప్రభుత్వ నిర్ణయాల పున:సమీక్ష సవాలు కేసు నుంచి ఈ కేసును వేరే చేస్తూ ధర్మానసం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను డిసెంబర్ 12వ తేదీకి ధర్మానసం వాయిదా వేసింది. అప్పట్లో సీఎం జగన్ లేఖ..దేశ వ్యాప్తంగా సంచలనానికి కారణమైంది. ఈ ఫిర్యాదును సుప్రీం కోర్టులోనే గతంలోనే కొట్టివేసింది. ఈ లేఖకు సంబంధించి ఆ తరువాతి కాలంలో రాజకీయంగానూ పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. సుప్రీం న్యాయమూర్తిగా ఉన్న ఎన్వీ రమణ ఆ తరువాత ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించి కొద్ది నెలల క్రితం పదవీ విరమణ చేసారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications