"సీఎం" ఫోటో చిన్నగా వేస్తారా.. నిప్పులు చెరిగిన పిఠాపురం వర్మ !!
ఏపీలోని పిఠాపురం నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేసిన పారిశుద్ధ్య కార్మికుల శిక్షణ కార్యక్రమంలో జరిగిన ఒక సంఘటన రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ కార్యక్రమానికి హాజరైన టీడీపీ నేత, నియోజకవర్గ ఇన్చార్జ్ SVSN Varma మున్సిపల్ అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ కార్యక్రమం మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు.
అయితే ఈ ఘటనకు కారణం స్టేజ్పై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అని తెలుస్తోంది. ఆ ఫ్లెక్సీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో పెద్దగా ఉండగా, సీఎం నారా చంద్రబాబు ఫోటో చిన్నగా ఉండటం వర్మను ఆగ్రహానికి గురి చేసింది.
కాగా ముఖ్యమంత్రి చిత్రానికి గౌరవం ఇవ్వకుండా ఇలా చేయడం సరైంది కాదని ఆయన మున్సిపల్ అధికారులను ప్రశ్నించారు. "చంద్రబాబుకు గౌరవం లేని చోట తాము ఎందుకు ఉండాలి?" అంటూ అసహనం వ్యక్తం చేస్తూ కార్యక్రమం నుంచి బయటకు వెళ్లిపోయారు. ఈ ఘటన సమయంలో వేదికపై జనసేన పార్టీ నాయకులు కూడా ఉన్నారు. అయితే వర్మ ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడు వారు ఎవరూ స్పందించకపోవడం గమనార్హంగా మారింది. దీంతో ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

ఇక పిఠాపురం రాజకీయాల్లో ఇప్పటికే టీడీపీ-జనసేన మధ్య విభేదాలు ఉన్నాయనే చర్చ చాలాకాలంగా కొనసాగుతోంది. గత ఎన్నికల సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయం కోసం టీడీపీ నేత వర్మ కీలకంగా పనిచేశారు. ఎన్నికల ప్రచార సమయంలో పవన్ కళ్యాణ్ కూడా తన గెలుపు బాధ్యతలను వర్మ భుజాలపై పెట్టినట్టు ప్రకటించారు. అయితే ఎన్నికల తర్వాత పరిస్థితులు మారిపోయాయని టీడీపీ వర్గాలు అంటున్నాయి.
ఈ నేపథ్యంలో గతంలో కూడా వర్మ చేసిన కొన్ని వ్యాఖ్యలు, సోషల్ మీడియా పోస్టులు పెద్ద చర్చకు దారితీశాయి. గత ఏడాది ఆయన తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఒక వీడియో పోస్టు చేయడం సంచలనం సృష్టించింది. "కష్టపడి సాధించే విజయానికి గౌరవం" అనే క్యాప్షన్తో విడుదలైన ఆ వీడియోలో ఎన్నికల ప్రచారంలో తాను చేసిన కార్యక్రమాలను చూపించారు. అయితే ఆ వీడియోలో ఎక్కడా పవన్ కళ్యాణ్ ఫోటో లేకపోవడం వివాదానికి దారి తీసింది. దీనిపై వివరణ ఇచ్చిన వర్మ, తన సోషల్ మీడియా అకౌంట్ను హైదరాబాద్కు చెందిన ఒక సంస్థ నిర్వహిస్తోందని తెలిపారు. తన అనుమతి లేకుండా ఆ వీడియో పోస్టు చేయబడిందని, విషయం తెలుసుకున్న వెంటనే దాన్ని తొలగించించానని చెప్పారు. భవిష్యత్తులో తన అనుమతి లేకుండా తప్పుడు పోస్టులు చేస్తే చర్యలు తీసుకుంటానని కూడా హెచ్చరించారు.
వేదికపై పవన్ కల్యాణ్ ఫోటో పెద్దదిగా, సీఎం చంద్రబాబు ఫోటో చిన్నదిగా ఉండటంపై ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
— oneindiatelugu (@oneindiatelugu) March 13, 2026
"ముఖ్యమంత్రికి గౌరవం లేని చోట నేను కూర్చోలేను" అంటూ స్టేజ్ ఎక్కకుండానే వెనుదిరిగారు.!#SVSNVarma #ChandrababuNaidu #PawanKalyan #PoliticsToday #OITelugu pic.twitter.com/L4MEqq1r92
ఇదిలా ఉండగా, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన నేతలు అక్రమంగా ఇసుక వ్యాపారం చేస్తున్నారని వర్మ గతంలో ఆరోపణలు చేసిన సంగతి కూడా అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసింది. దీనికి సంబంధించి సాక్ష్యాలు కూడా బయటపెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. తాజాగా జరిగిన ఈ ప్లెక్సీ వివాదం మరోసారి పిఠాపురం రాజకీయాలను వేడెక్కించింది. టీడీపీ, జనసేన మధ్య అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది. ఇకపై ఈ వ్యవహారం ఎలా మలుపు తిరుగుతుందో అన్నదానిపై స్థానిక రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications