కేసీఆర్తో భేటీ: తలసాని సహా 4గురు ఎమ్మెల్యేల షాక్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్లు షాక్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారు తెరాసలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును గురువారం ఉదయం పలువురు తెలంగాణ టీడీపీ నేతలు క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు. నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ కేసీఆర్ను కలిశారు. కేసీఆర్ను కలిసిన వారిలో తలసాని, తీగలతో పాటు పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్లు ఉన్నారు.

వీరు మరికొద్దిసేపట్లో అధికారికంగా తాము తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనున్నట్లు ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది. తెలంగాణ టీడీపీలో తెలంగాణవాదులు ఉన్నారని, అలాంటి వారు టీడీపీని వీడాలని, కొద్ది రోజుల్లో తమ పార్టీలోకి పలువురు తెలంగాణ టీడీపీ నేతలు వస్తారని కొద్ది రోజులుగా తెరాస నాయకులు చెబుతున్న విషయం తెలిసిందే.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications