టార్గెట్ బీజేపీ, మారుతున్న సమీకరణాలు - ఆ ఇద్దరూ ఎవరి వైపు..!!
2024 ఎన్నికలకు కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. కర్ణాటక కొత్త సీఎం ప్రమాణ స్వీకారం ప్రతిపక్షాల బలం ఐక్యత చాటేందుకు వేదికగా మారింది. బీజేపీ లక్ష్యంగా వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామనే సంకేతాలు ఇచ్చాయి. ప్రతిపక్షాల భారీ ఈవెంట్ కు ఆప్..టీఎంసీ దూరంగా ఉంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటుగా ఒడిశా సీఎం తటస్థంగా ఉంటున్నారు. దీంతో..ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ మద్దతు పార్టీలపై క్లారిటీ వస్తోంది. తెలుగు ప్రాంతీయ పార్టీలు ఎవరి వైపు. లెక్కలు మారుతున్నాయా.
విపక్షాల ఐక్య వేదికగా :కర్ణాటక లో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. పూర్తి మెజార్టీతో గెలిచిన వేళ కాంగ్రెస్ నాయకత్వంలో సంతోషం కనిపిస్తోంది. అగ్ర నేతలు తరలి వచ్చారు. రాహుల్ గాంధీ, ప్రియాక గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేతో పాటుగా ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తరలి వచ్చారు. మిత్రపక్షాల నేతలు నితీశ్ కుమార్ తో పాటుగా శరద్ పవార్, తమిళనాడు సీఎం స్టాలిన్, సీపీఐ నేత రాజా, సీపీఎం నేత సీతారాం ఏచూరి, ముఫ్తీ, ఫరూక్ అబ్దుల్లా, శరద్ పవార్ హాజరయ్యారు. దీని ద్వారా బీజేపీ వ్యతిరేక పార్టీల ఐక్య వేదికకు కర్ణాటక వేదికగా నిలిచింది. బీజేపీ లక్ష్యంగా ఈ నేతలంతా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు తొలి అడుగు పడింది. ఇదే సమయంలో భవిష్యత్ రాజకీయ సమీకరణాలకు స్పష్టత ఇచ్చారు.

ఆ ఇద్దరు నేతలు దూరం:ఇదే సమయంలో బీజేపీ పైన పోరాటం చేస్తున్నా..కాంగ్రెస్ తో టీఎంసీ, ఆప్ దూరం పాటిస్తున్నాయి. ఈ రెండు పార్టీల చీఫ్ లు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హాజరు కాలేదు. మూడు రాష్ట్రాల్లో ఈ రెండు పార్టీల ప్రభావం బలంగా ఉంది. ఈ రెండు పార్టీలతో కాంగ్రెస్ నాయకత్వం సైతం ఆచి తూచి వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ కు పూర్తిగా మద్దతు ఇస్తూ వచ్చిన సమాజ్ వాదీ నుంచి ఈ కార్యక్రమానికి ఎవరూ హాజరు కాలేదు. రానున్న ఆరు నెలల కాలంలో నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటక తరహా పాలసీని అమలు చేసి అక్కడా పట్టు నిరూపించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. తెలంగాణలో నూ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న అధికార బీఆర్ఎస్ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో కలిసేందుకు సిద్దంగా లేదు.
మారుతున్న సమీకరణాలు:ఏపీలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి కర్ణాటక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఇతర పార్టీల నేతలెవరూ హాజరు కాలేదు. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు దూరం గా ఉంటోంది. బీజేపీకి అవసరమైన సమయంలో మద్దతు ఇస్తోంది. బీజేపీతో జనసేన మిత్రపక్షంగా ఉంది. టీడీపీ, జనసేన రెండు పార్టీలో వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీజేపీతో కలిసి పోరాటం చేయాలని భావిస్తున్నాయి. బీజేపీ నిర్ణయం తేలాల్సి ఉంది. ఈ సమయంలో మరి కొద్ది రోజుల్లోనే ఏపీలోని ఈ మూడు పార్టీలు ఎవరు ఎవరితో కలుస్తారనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
-
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్!












Click it and Unblock the Notifications