మంత్రి దుర్గేశ్ కు తెలుగు తమ్ముళ్ల షాక్..!!
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలైంది. అప్పుడే కూటమిలో నిరసనలు కనిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ధర్మవరంలో బీజేపీ మంత్రికి వ్యతిరేకంగా రోడ్డెక్కిన టీడీపీ శ్రేణులు..ఇప్పుడు జనసేన మంత్రికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. తాము గెలిపించిన మంత్రి తమను పట్టించుకోవటం లేదని ఆగ్రహంతో ఉన్నారు. మంత్రి కందుల దుర్గేశ్ ను టీడీపీ శ్రేణులు నిలదీయటం జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారింది.
మంత్రిపై ఆగ్రహం
రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి పల్లె పండుగ కార్యక్రమం ప్రారంభమైంది. తూర్పు గోదావరి జిల్లా మంత్రి కందుల దుర్గేశ్ ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు నిడదవోలులోని కంసాలిపాలెం గ్రామానికి వచ్చారు. నిడుదవోలులో పొత్తు ధర్మంలో భాగంగా తామంతా సహకరించి గెలిపిస్తే.. తమను నిర్లక్ష్యం చేయటం పైన స్థానిక టీడీపీ కేడర్ ఆగ్రహంతో రగిలిపోతోంది. ఇప్పుడు మంత్రి తమ ప్రాంతానికి రావటంతో వారంతా నిలదీసారు. పల్లె పండుగ సంబంధించి తమకు ఎలాంటి సమాచారం ఎందుకు ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.

పట్టించుకోవటం లేదంటూ
అధికారంలోకి వచ్చి మంత్రి అయిన సమయం నుంచి తమను పట్టించుకోవటం లేదంటూ కందుల దుర్గేశ్ పైన మండిపడ్డారు. తమ మద్దతు లేకపోతే ఎన్నికల ఫలితం ఎలా ఉండేదో ఆలోచన చేసుకోవాలని హెచ్చరించారు. తమ సమస్యల గురించి ప్రస్తావన చేస్తుంటే.. మంత్రికి మద్దతుగా కడియం నుంచి వచ్చిన వారు తమ పైన దుర్భాషలాడటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసారు. దీంతో, మంత్రి వారిని సముదాయించే ప్రయత్నం చేసారు. అందరినీ కలుపుకొని వెళ్లేందుకు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.
జనసేన మంత్రి కందుల దుర్గేష్ను అడ్డుకున్న టీడీపీ నాయకులు
— Telugu Scribe (@TeluguScribe) October 14, 2024
నిడదవోలు మండలం కంసాలిపాలెంలో మంత్రి కందుల దుర్గేష్ హాజరైన పల్లె పండుగ కార్యక్రమంలో ఉద్రిక్తత.
జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన తమకు ప్రభుత్వ కార్యక్రమాల్లో కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదని… pic.twitter.com/9jbwihLNAw
కొరవడిన సమన్వయం
అయితే, జిల్లాలో మూడు పార్టీల నేతలు - కేడర్ మధ్య సమన్వయం కొరవడుతోందనే వాదన వినిపిస్తోంది. మంత్రులు మూడు పార్టీల కేడర్ ను పట్టించుకోవటం లేదనే ఫిర్యాదులు పార్టీ అధినాయకత్వానికి అందుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలోని ఇద్దరు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు పార్టీల కార్యకర్తలను ఎక్కడా పట్టించుకోవటం లేదని.. ఎవరైనా కలిసేందుకు ప్రయత్నం చేస్తే వారికి అవకాశం ఇవ్వటం లేదని మండిపడుతున్నారు. ఇక, మంత్రి కందుల దుర్గేశ్ ని టీడీపీ మద్దతు దారులు నిలదీయటం పైన జిల్లాలో రాజకీయంగా చర్చ జరుగుతోంది.
-
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
పెమ్మసానికి అంబటి స్ట్రాంగ్ వార్నింగ్..! -
తెలంగాణాలో వైద్య సేవలు టాప్.. లెక్కలు చెప్పిన మంత్రి! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..?












Click it and Unblock the Notifications