1995లో ఎన్టీఆర్ తో ఇదీ జరిగింది - బాలయ్య నాడు మద్దతుగా : భువి ఐ లైక్ యూ - చంద్రబాబు..!!
1995లో ఏం జరిగింది. ఎన్టీఆర్ ను వెన్నుపోటు ఆరోపణలపై చంద్రబాబు వివరణ ఇచ్చారు. నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా అన్ స్టాపబుల్ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు - లోకేశ్ తో జరిగిన ఇంటర్వ్యూ ఈ రోజున ప్రసారం అయింది. అందులో చంద్రబాబు 1995 ఎపిసోడ్ గురించి చెప్పుకొచ్చారు. అప్పుడు ఎన్టీఆర్ వద్దకు నలుగురం వెళ్లామని చంద్రబాబు వివరించారు. తనతో పాటుగా బాలకృష్ణ..హరి కృష్ణ ఉండగా, అప్పటికే ఎన్టీఆర్ వద్ద బీవీ మోహన్ రెడ్డి ఉన్నారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.

ఎన్టీఆర్ కాళ్లు పట్టుకున్నా, కానీ
ఏ విషయం మీద వచ్చారని ఎన్టీఆర్ అడగ్గా.. రాజకీయం అని చెప్పామన్నారు. దీంతో.. ఆ ముగ్గురిని బయటకు వెళ్లమని.. తనతో మాట్లాడారని చంద్రబాబు చెప్పారు. దాదాపు మూడు గంటల పాటు తమ మధ్య చర్చ జరిగిందన్నారు. ఒక్క సారి ఎమ్మెల్యేలందరితో మాట్లాడాలని కోరానన్నారు. కాళ్లు పట్టుకొని..తాను చెప్పాలనుకున్నది చెప్పానని చంద్రబాబు చెప్పారు. తాను ఎంత చెప్పినా ఆయన వినలేదన్నారు. బయట నుంచి వచ్చిన వారి ప్రభావం ఆయన మీద ఎక్కువగా ఉందని వివరించారు. ఆయనకు జరుగుతున్నది చెప్పి.. మార్చుకోమ ని చాలా మంది నమ్మిన బంట్లు చెప్పారని గుర్తు చేసారు. నాడు రామ బాట కోసం ఆంజనేయుడు చేసిన విధంగానే ఎన్టీఆర్ కోసం తాము చేస్తున్నామని వెల్లడించారు. తాను చేసింది తప్పా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.

నారా-నందమూరి-టీడీపీ నిర్ణయం అది
దీనికి బాలయ్య స్పందిస్తూ తాను నందమూరి కుటుంబ సభ్యుడిగా..టీడీపీ మెంబర్ గా చెబుతున్నానని..తప్పు కాదని బాలయ్య తేల్చి చెప్పారు. చంద్రబాబు చేసింది తప్పు కాదని 1999 ఎన్నికలే స్పష్టం చేసాయని బాలయ్య చెప్పుకొచ్చారు. 1995లో అధికార మార్పిడి నిర్ణయం నారా - నందమూరి - టీడీపీ కలిసి తీసుకున్న నిర్ణయంగా బాలకృష్ణ చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ తనకు ఆరాధ్య దైవమని చంద్రబాబు చెప్పారు. ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పును చంద్రబాబు తప్పు బట్టారు. అధికారంలోకి రాగానే తిరిగి ఎన్టీఆర్ పేరు పెడతామని స్పష్టం చేసారు. ఎన్టీఆర్ శతజయంతి తో పాటుగా ఆయన ఆశయాలను పార్టీ తరపున అమలు చేస్తున్నామని చంద్రబాబు వివరించారు. 1995లో ఎన్టీఆర్ పైన పక్కన ఉన్న వారి ప్రభావం ఎక్కువగా ఉందన్నారు.

భువి..ఐ లైక్ యూ
ఆ వ్యవహారానికి 199లో చంద్రబాబును సీఎం చేయటం ద్వారా ప్రజలు ఓకే చేసారని.. ఇక ఈ టాపిక్ కు శుభం కార్డు పడిందని బాలయ్య తేల్చేసారు. దీనికి కొసాగింపుగా చంద్రబాబుతో బాలయ్య ఫ్రాంక్ కాల్స్ చేయించారు. ముందుగా బ్రాహ్మణితో మాట్లాడించారు. ఆ తరువాత చంద్రబాబు సతీమణికి ఫోన్ చేసి ఐ లవ్ యూ చెప్పాలని బాలయ్య కోరగా.. స్పీకర్ ఫోన్ లో చంద్రబాబు ఐ లైక్ యూ అంటూ భువనేశ్వరికి చెబుతారు. భువనేశ్వరి సహకారంతోనే తాను ఇవన్నీ సాధించానని చంద్రబాబు ప్రశంసిస్తారు. ఇక, లోకేశ్ షో లో జాయిన అయిన తరువాత... తాను పూర్తిగా తన తల్లి నుంచే అన్నీ నేర్చుకున్నానని చెప్పుకొచ్చారు. తల్లి - లోకేశ్ ఇద్దరూ ఒకే పార్టీ అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications