Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మోడీని ఆర్ధిక సహా ఆ మూడు శాఖలు కోరిన చంద్రబాబు-ముస్లిం రిజర్వేషన్లపై క్లారిటీ..!

దేశవ్యాప్తంగా తాజాగా వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు కేంద్రంలో టీడీపీ అధినేత చంద్రబాబును కీలకంగా మార్చేశాయి. ముఖ్యంగా మిత్రపక్షాల సాయం లేకుండా ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటు కష్టంగా మారిన నేపథ్యంలో ప్రధాని మోడీ ముందు టీడీపీతో పాటు జేడీయూ కీలక డిమాండ్లు పెడుతున్నాయి. ఇప్పటికే కేంద్రంలో కీలక మంత్రిత్వశాఖలతో పాటు స్పీకర్ పోస్టును కూడా అడుగుతున్న ఈ రెండు పార్టీలు.. ఇవాళ జరుగుతున్న ఎన్డీయే పక్షాల రెండో భేటీలో తమ డిమాండ్లను మరోసారి ప్రస్తావించాయి.

ఇవాళ ఢిల్లీలో జరుగుతున్న ఎన్డీయే మిత్రపక్షాల రెండో భేటీలో టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్రం ముందు పలు కీలక డిమాండ్లు ఉంచారు. ఇందులో కేంద్రంలో తమకు కీలకమైన ఆర్ధిక, ఐటీ, రవాణా శాఖలు ఇవ్వాలని బీజేపీ పెద్దల్ని కోరారు. అలాగే లోక్ సభ స్పీకర్ పదవి కూడా తమకు ఇవ్వాలని పట్టుబట్టారు. వీటితో పాటు ఏపీలో ముస్లిం రిజర్వేషన్లను కొనసాగిస్తామని బీజేపీ పెద్దలకు తేల్చిచెప్పేశారు. దీంతో ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా వీటిపై చర్చిద్దామని చెప్పినట్లు తెలుస్తోంది.

tdp demands finance IT and transport berths at centre clarified no scrap of muslim quota in ap

అలాగే ఎన్డీయేలో బీజేపీ, టీడీపీ తర్వాత మూడో అతిపెద్ద పార్టీ అయిన జేడీయూ అధినేత నితీశ్ కుమార్ కూడా పలు డిమాండ్లను మోడీ, షా ముందు ఉంచారు. వీటిలో సైన్యంలో ఎంపికల కోసం తెచ్చిన అగ్నివీర్ పథకం రద్దు, దేశవ్యాప్త కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే కేంద్రంలో తమకు కీలకమైన మూడు శాఖల్ని ఇవ్వాలని కోరారు. అయితే స్పీకర్ పోస్టుకు మాత్రం ఈసారి పట్టుబట్ట లేదని తెలుస్తోంది. కానీ ఎన్డీయే కన్వీనర్ పోస్టు తనకు ఇవ్వాలని నితీశ్ అడుగుతున్నారరాు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+