'మీకన్నా జగనే మేలు కదరా'..కూటమిపై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన కామెంట్స్
రాష్ట్ర రాజకీయాల్లో జేసీ బ్రదర్స్ తీరే సపరేటు. వాళ్లు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీని ఇరాకటంలోకి నెట్టడం వారికి మొదటి నుంచి అలవాటు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న జేసీ బ్రదర్స్ తర్వాత , టీడీపీలో కొనసాగుతున్నారు. గత టీడీపీ హయంలో సొంత ప్రభుత్వంపైనే తీవ్ర విమర్శలు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. టీడీపీ కూటమి మరోసారి అధికారంలోకి రావడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి తనదైనశైలిలో స్పందిస్తున్నారు. మద్యం సిండికెట్లో తనకు 2 శాతం వాటా చెల్లించాలని బహిరంగంగానే తెలిపారాయన.
అయితే అలా వచ్చిన డచ్చులను తాడిపత్రి అభివృద్దికే ఉపయోగిస్తానని ఆయన తెలిపారు. ఆ మధ్య రోడ్డు పక్కన ఉన్న చిరు వ్యాపారులను బెదరిస్తోన్న వీడియోలు సైతం బయటకు వచ్చాయి. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో జేసీ ప్రభాకర్ రెడ్డి వైరం పెట్టుకున్నారు. వెట్ ఫ్లై యాష్ దందా విషయంలో ఇరు నేతల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. రోజుకు రూ.5 లక్షల రూపాయిల వరకు ఆదాయం వస్తుండటంతో ఇరు నేతలు వెట్ ఫ్లై యాష్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేశారు. ఈ పంచాయితీ సీఎం చంద్రబాబు వద్దకు చేరింది. ఆయన జేసీ, ఆదినారాయణరెడ్డిలను స్వయంగా అమరావతికి కలవాలని తెలిపారు.

చంద్రబాబు పిలుపుతో ఆది నారాయణరెడ్డి అమరావతికి వచ్చారు. జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం ఈ భేటీకి డుమ్మా కొట్టారు. తాజాగా జేసీ ట్రావెల్స్ బస్సులకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించారు.అందులో ఒకటి పూర్తిగా దగ్ధమైంది. మరో మూడు పాక్షికంగా కాలిపోయాయి.ఈ ఘటనపై జేసీ ప్రభాకర్ రెడ్డి తనదైనశైలిలో స్పందించారు.నా బస్సులు కాల్చారు. అయితే ఏమౌతుంది.. కనీసం నేను ఫిర్యాదు కూడా చేయనని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.మీకన్నా జగనే మేలు కదరా అంటూ సొంత ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. జగన్ కేవలం బస్సులు తిరగ్గకుండా మాత్రమే ఆపారని, కానీ మీ బీజేపీ ప్రభుత్వంలో బస్సులు తగులబెట్టించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీకన్నా జగనే మేలు కదరా - జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలనం.!#JCPrabhakarReddy #YSJagan #ChandrababuNaidu #APPolitics pic.twitter.com/7tdYsm7NzV
— oneindiatelugu (@oneindiatelugu) January 2, 2025
ఇంతకన్నా నీచం మరోకటి లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు.బస్సులు కాల్చి ఏం సాధించారని జేసీ ఈ సందర్భంగా ప్రశ్నించారు. మీకంటే జగనే మంచోడు.. జగన్ బస్సులు ఎప్పుడు కాల్చలేదని, కేవలం బస్సులను నిలబెట్టించాడని జేసీ తెలిపారు.ఈ బస్సులను డ్రైవర్లకు ఇచ్చేశానని, వారి కడుపు కొట్టారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. 4 కోట్ల రూపాయిలతో దేవాలయాల అభివృద్దికి ఖర్చు చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. తమ బస్సుల దగ్దం వెనుక బీజేపీ నేతలున్నారని జేసీ బలంగా నమ్మినట్టు ఉన్నారని, అందుకే ఆయన బీజేపీ నేతలపై ఇలాంటి కామెంట్స్ చేసి ఉంటారని టీడీపీ నేతలు భావిస్తున్నారు.ఏదైన జగన్ మీకంటే మంచోడని జేసీ చెప్పడం ఇప్పుడు ఏపీ రాజకీయా వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications