మురళీ మోహన్ ఎఫెక్ట్, బాబు ఆగ్రహం: అది కాదు.. సినీ పరిశ్రమపై తగ్గిన రాజేంద్రప్రసాద్
అమరావతి: సినిమా పరిశ్రమపై తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ గురువారం చెప్పారు. బుధవారం ఆయన సినిమా పరిశ్రమపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
దీనిపై పలువురు మండిపడ్డారు. బీజేపీ నాయకురాలు, నటి కవితతో పాటు స్వయంగా టీడీపీ ఎంపీ మురళీ మోహన్ అధినేత చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు హోదా కోసం ఉద్యమిస్తుంటే పక్కదారి పట్టిస్తావా అని మండిపడ్డారు. దీంతో రాజేంద్ర ప్రసాద్ తగ్గారు.

ఎవరినీ బాధపెట్టాలని తాను అలా మాట్లాడలేదని, సినిమావాళ్లు కూడా ఉద్యమంలోకి వస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందనేదే తన ఉద్దేశమని చెప్పారు. ముఖ్యమంత్రికి అండగా నిలవాలనే ఉద్దేశంతో తాను చేసిన వ్యాఖ్యల్ని వారు అర్థం చేసుకోవాలన్నారు.
చంద్రబాబు పడుతున్న కష్టానికి బాధ అనిపించే అలా మాట్లాడానన్నారు. క్లిష్టపరిస్థితుల్లో అందరూ ముఖ్యమంత్రికి అండగా నిలవాలన్నదే తన ఉద్దేశమన్నారు.
-
ప్రభుత్వ ఉపాధ్యాయులకు డబుల్ శుభవార్తలు చెప్పిన ఏపీ సర్కార్! -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో












Click it and Unblock the Notifications