మురళీ మోహన్ ఎఫెక్ట్, బాబు ఆగ్రహం: అది కాదు.. సినీ పరిశ్రమపై తగ్గిన రాజేంద్రప్రసాద్
అమరావతి: సినిమా పరిశ్రమపై తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ గురువారం చెప్పారు. బుధవారం ఆయన సినిమా పరిశ్రమపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
దీనిపై పలువురు మండిపడ్డారు. బీజేపీ నాయకురాలు, నటి కవితతో పాటు స్వయంగా టీడీపీ ఎంపీ మురళీ మోహన్ అధినేత చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు హోదా కోసం ఉద్యమిస్తుంటే పక్కదారి పట్టిస్తావా అని మండిపడ్డారు. దీంతో రాజేంద్ర ప్రసాద్ తగ్గారు.

ఎవరినీ బాధపెట్టాలని తాను అలా మాట్లాడలేదని, సినిమావాళ్లు కూడా ఉద్యమంలోకి వస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందనేదే తన ఉద్దేశమని చెప్పారు. ముఖ్యమంత్రికి అండగా నిలవాలనే ఉద్దేశంతో తాను చేసిన వ్యాఖ్యల్ని వారు అర్థం చేసుకోవాలన్నారు.
చంద్రబాబు పడుతున్న కష్టానికి బాధ అనిపించే అలా మాట్లాడానన్నారు. క్లిష్టపరిస్థితుల్లో అందరూ ముఖ్యమంత్రికి అండగా నిలవాలన్నదే తన ఉద్దేశమన్నారు.
-
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications