రైల్వేజోన్ కోసం ఎంపీ ఆవంతి శ్రీనివాస్ నిరహరదీక్ష
విశాఖపట్టణం: విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఇవ్వాలనే డిమాండ్తో టిడిపి ఎంపీ ఆవంతి శ్రీనివాస్ ఆదివారం నాడు నిరహరదీక్ష చేపట్టారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కోసం ఎలాంటి త్యాగానికైనా తాను సిద్దమేనని ఆయన ప్రకటించారు.
విభజన హమీ చట్టాన్ని అమలు చేయడంలో కేంద్రం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆయన చెప్పారు. ఏపీ రాష్ట్రానికి ఇచ్చిన హమీలను కేంద్రం విస్మరించిందని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము కేంద్ర ప్రభుత్వం నుండి బయటకు వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

కేంద్రం వైఖరిని నిరసిస్తూ ఇటీవల కాలంలో అనేక ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.అయినా ప్రధానమంత్రి మోడీ నిర్లక్ష్యాన్ని వీడడం లేదన్నారు.
విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు విషయమై రాజకీయ నిర్ణయం తీసుకొంటే సరిపోతోందన్నారు. కానీ, కేంద్రం ఉద్దేశ్యపూర్వకంగానే ఈ విషయమై తాత్సారం చేస్తోందని ఆయన మండిపడ్డారు.
విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు అనేది ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ అని ఆయన చెప్పారు.రైల్వేజోన్ ను సాధించేవరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన చెప్పారు.ఈ దీక్షలో టిడిపి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ తదితరులు పాల్గొన్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!!












Click it and Unblock the Notifications