Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాబిన్ శర్మకు కలిసొచ్చిన "ఈశాన్యం" - టీడీపీలో మొదలైన కొత్త లెక్కలు..!!

టీడీపీకి వ్యూహకర్తగా సేవలందిస్తున్న రాబిన్ శర్మ పైన పార్టీలో అంచనాలు పెరుగుతున్నాయి.

వచ్చే ఎన్నికలకు టీడీపీ సిద్దమవుతోంది. జనసేనతో పొత్తు..స్ట్రాటజిస్టుల వ్యూహాలు అమలు చేస్తోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో టీడీపీ తమ అభ్యర్ధులను ఖరారు చేసింది. పొత్తులపై అధికారిక నిర్ణయం తరువాత ఇతర నియోజకవర్గాలపైన నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో చంద్రబాబు జిల్లాల పర్యటనలు..లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. పార్టీ రాజకీయ వ్యూహకర్తగా రాబిన్ శర్మ ఎన్నికల వ్యూహాలు..ప్రచారం పైన పార్టీకి సలహాలు ఇస్తున్నారు. రాబిన్ శర్మ గతంలో ప్రశాంత్ కిషోర్ తో కలిసి పని చేసారు. ఇప్పుడు టీడీపీ కోసం పని చేస్తూనే..ఆయన తాజాగా ఈశాన్యం లో తన వ్యూహాలతో వార్తల్లో నిలిచారు. మేఘాలయాలో రాబిన్ టీం పని చేసిన ఎన్‌పీపీకి అధికారం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసాయి. ఇప్పుడు ఇది టీడీపీలో కొత్త చర్చకు కారణమవుతోంది.

టీడీపీకి రాబిన్ శర్మ వ్యూహాలు

టీడీపీకి రాబిన్ శర్మ వ్యూహాలు


ఇప్పుడు ఏపీలో రెండు ప్రధాన పార్టీలు వైసీపీ..టీడీపీకి వ్యూహకర్తలు తెర వెనుక సేవలు అందిస్తున్నారు. ఇద్దరూ గతంలో ఐప్యాక్ లో ప్రశాంత్ కిషోర్ తో పాటుగా సహ వ్యవస్థాపకులుగా ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ వీడిన తరువాత ఇద్దరూ తమ టీంలతో వేర్వేరుగా పార్టీలతో ఒప్పందాలు చేసుకొని ఆ పార్టీల గెలుపు కోసం వ్యూహాలు అమలు చేస్తున్నారు. గత ఏడాదికి పైగా రాబిన్ శర్మ టీం ఏపీలో టీడీపీ కోసం పని చేస్తోంది. కొంత కాలం క్రితం జరిగిన పార్టీ కీలక సమావేశంలోనూ రాబిన్ శర్మ ఇదేం ఖర్మ..కార్యక్రమ నిర్వహణ పైన పార్టీ నేతలకు సూచనలు చేసారు. ఇప్పుడు వైసీపీ నిర్ణయాలు..నినాదాలకు కౌంటర్ గా టీడీపీ ఎన్నికల బరిలోకి దిగేందుకు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు.

మేఘాలయలో సక్సెస్ అయిన రాబిన్ టీం

మేఘాలయలో సక్సెస్ అయిన రాబిన్ టీం

ఇదే సమయంలో తాజాగా ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో జరిగిన ఎన్నికల్లో ఎన్‌పీపీ విజయం కోసం రాబిన్ శర్మ టీం పని చేసింది. క్షేత్ర స్థాయి నుంచి పోలింగ్ జరిగే వరకూ అన్ని బాధ్యతలు ఈ టీం పర్యవేక్షించింది. మేఘాలయలో 60 సీట్లకు పోలింగ్ జరిగింది. అందులో ఎన్‌పీపీకి 18-24 సీట్ల వరకు వస్తాయని..ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసాయి. అదే సమయంలో ప్రధానంగా పోటీ దారుగా నిలిచిన టీఎంసీకి ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ పనిచేసింది. షో టైమ్ కన్సల్టింగ్ పేరుతో అక్కడ రాబిన్ శర్మ టీం ఎన్‌పీపీ గెలుపు కోసం గ్రౌండ్ వర్క్ చేసింది. మేఘాలయో ప్రజలను ప్రభావితం చేస్తున్న అంశాలు..ఎన్నికల్లో ప్రధానంగా ఓటర్లపైన పని చేసే అస్త్రాల పైన రాబిన్ శర్మ టీం ఫోకస్ చేసింది. మేఘాలయలో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఎన్పీపీ పార్టీల కలిసి పోటీ చేసి అధికారాన్ని పంచుకోగా, ఈ సారి ఇరు పార్టీలు వేరువేరుగా పోటీ చేశాయి.
టీడీపీకి రాబిన్ మేజిక్ కలిసొచ్చేనా

టీడీపీకి రాబిన్ మేజిక్ కలిసొచ్చేనా

మేఘాలయలో 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 21 సీట్లు గెలుచుకున్నా... వారిలో అత్యధికులను మాజీ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా తన వెంట టీఎంసీలోకి తీసుకెళ్లడంతో ఈ సారి టీఎంసీ బలం పెరిగిందనే అంచనాలు వ్యక్తం అయ్యాయి. కానీ, పోలింగ్- ఎగ్జిట్ పోల్స్ సమయానికి ఎన్‌పీపీకి మెజార్టీ ఖాయమనే అంచనాలు వెలువడ్డాయి. ఎన్‌పీపీ దాదాపు 29 శాతం ఓట్ షేర్ దక్కించుకున్నట్లు తేలింది. ఇప్పుడు మేఘాలయ ఫలితాలు టీడీపీలో చర్చకు కారణమయ్యాయి. రాబిన్ శర్మ టీం మేఘాలయలో పని చేసిన పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటూ ఎగ్జిట్ పోల్స్ రావటంతో ఇప్పుడు టీడీపీకి పని చేస్తున్న అదే టీం పైన నమ్మకం మరింత పెరిగినట్లు కనిపిస్తోంది. రాబిన్ శర్మకు ప్రత్యేకంగా వైసీపీ వ్యూహాల పైన స్పష్టత ఉండటంతో..టీడీపీకి ఎన్నికల సమయానికి వ్యూహకర్త అందించే సూచనలు..మార్గదర్శనం పార్టీ గెలుపుకు సహకరిస్తాయనే నమ్మకం కనిపిస్తోంది. మరి ఏపీ ఎన్నికల్లో రాబిన్ మేజిక్ వర్కవుట్ అవుతుందా లేదా అనేది చూడాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+