గర్ల్స్తో అసభ్యంగా ప్రవర్తించిన టెక్కీకి దేహశుద్ది, అరెస్ట్
ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో ఇంజనీరింగ్ విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బిక్కనూరు మండలం రాజంపేటకు చెందిన శ్రీనివాస్ హైదరాబాదులోని ఓ కళాశాలలో బిటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. మొదటి రెండు సంవత్సర పరీక్షల్లో ఉత్తీర్ణత పొందని శ్రీనివాస్ మనోవేదనతో ఆత్మహత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు.
దొంగ బీభత్సం
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట శివారు విష్ణుపురంలో శనివారం రాత్రి దోప్డీ దొంగ బీభత్సం సృష్టించాడు. శనివారం రాత్రి ఓ ఇంటి తలుపులు పగులగొట్టి ప్రవేశించిన దొంగ మహిళను, ఆమె మనువరాలిని కత్తితో బెదిరించి లక్ష రూపాయల నగదును ఎత్తుకెళ్లాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.
బాలుడి మృతి
కడప జిల్లా మైదుకూరు మండలం పాతపాలెం వద్ద జాతీయ రహదారి బైపాస్ పైన లారీ ఢీకొని పదకొండేళ్ల బాలుడు మృతి చెందాడు. రోడ్డు దాటుతున్న బాలుడ్ని వేగంగా వెళ్తున్న లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.