టీపై వైఖరి మారలేదు, అగ్రనేతలు చెప్పారు: కిషన్ రెడ్డి

తెలంగాణపై తాము యూటర్న్ తీసుకున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్ నాథ్ దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ బిల్లుపై ఆందోళన అవసరం లేదని, తమ పార్టీ మద్దతు ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంటులో జరిగిన ఘటనలు మంచి సంప్రదాయం కాదని, పార్లమెంటు సభ్యులే భ్రష్టు పట్టించారని ఆయన అన్నారు.
రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్ ఆత్మ ఘోషించే విధంగా సంఘటనలు జరిగాయని ఆయన అన్నారు. అవాంఛనీయ సంఘటనలకు పాల్పడిన ఎంపీలు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని, మాజీ ఎంపీలు పొందే సౌకర్యాలను కూడా వారికి రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంపీలపై స్పీకర్ చర్యలు తీసుకోకపోతే రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని ఆయన అన్నారు.
పోరాటాల ఫలితంగా తెలంగాణ బిల్లు పార్లమెంటుకు వచ్చిందని, పార్లమెంటులో బిల్లుపై చర్చలో పాల్గొంటామని, తెలంగాణకు అనుకూలంగా ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో పార్లమెంటు వేదికగా ప్రజలకు వివరిస్తామని కిషన్ రెడ్డి చెప్పారు. తాము మాట మార్చలేదని, తెలంగాణ బిల్లును తాము వ్యతిరేకించబోమని ఆయన మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్రానికి ఉన్న మంచిపేరును ఎంపీలు మంట గలిపారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications