Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బాబు లేని రాజకీయాలు ఊహకు అందలేదు జగన్, అక్కడే చంద్రబాబు ఎత్తులకు పైఎత్తులు !

ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమలో భాగం అయిన చిత్తూరు నగరం తమిళనాడు సరిహద్దులో ఉంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే తిరుపతి, తిరుమల ఉండేది, నియోజక వర్గాల పునర్విభజన తరువాత తిరుపతి జిల్లా కేంద్రంగా అయ్యింది. చిత్తూరు రాజకీయాలను ఒకప్పుడు సీకే బాబు శాసించారు. ఎమ్మెల్యేగా ఉంటూనే సీకే బాబు జిల్లా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చక్రం తిప్పారు.

రాయలసీమలోని చిత్తూరు నగరంలో 2015లో అప్పటి మేయర్ కఠారి అనురాధ, ఆమె భర్త కటారి మోహన్‌లను ఏకంగా మేయర్ ఛాంబర్‌లోనే పట్టపగలు దారుణంగా హత్య చేయడంతో అప్పట్లో రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. తరువాత చిత్తూరు నివురుగప్పిన నిప్పులా వుంటుందని ప్రజలు అంటూ ఉంటారు. 1952లో ఏర్పడిన చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. చిత్తూరు అసెంబ్లీ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ 8 సార్లు, టీడీపీ మూడు సార్లు, ఇండిపెండెంట్, వైసీపీ ఒక్కోసారి చొప్పున విజయం సాధించారు.

Telugudesam and YCP parties are planning to win in Chittoor anyway

2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా చిత్తూరు, గుడిపాల మండలాలకే ఈ నియోజకవర్గం పరిమితమైంది. ఇక్కడి నుంచి సీకే జయచంద్రారెడ్డి అలియాస్ సీకే బాబు కాంగ్రెస్ తరపున మూడు సార్లు, ఇండిపెండెంట్‌గా ఒకసారి విజయం సాధించారు. చిత్తూరు అంటే సీకే బాబు అని, సీకే బాబు అంటే చిత్తూరు అన్నంతగా ఆయన బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సీకే బాబు చాలా సన్నిహితుడు.

చిత్తూరు నగరంతో పాటు రాయలసీమలోని చాలా నియోజక వర్గాల్లో, కర్ణాటక రాజధాని బెంగళూరులో సీకే బాబు అనుచరగణం వుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రాయలసీమ అభివృద్ధి మండలి ఛైర్మన్‌గానూ సీకే బాబు పనిచేశారు. 1994లో ఎన్టీఆర్ ప్రభంజనంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజక వర్గాల్లో 14 చోట్ల టీడీపీ గెలిచినా ఒక్క చిత్తూరులో మాత్రం సీకే బాబు విజయం సాధించడంతో ఆ ప్రాంతంలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది

కొంతకాలం పాటు సీకే బాబు ఫ్యాక్షన్ రాజకీయాలకు కేంద్ర బిందువుగానూ వున్నారు. తరువాత అనారోగ్య కారణాలతో, వ్యక్తిగత కారణాలతో సీకే బాబు సైలెంట్ అయిపోయారని చిత్తూరు ప్రజలు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సంస్కృతులు చిత్తూరు నగరంలో కనిపిస్తాయి. ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,00,789 మంది. వీరిలో పురుషులు 97,610 మంది.. మహిళలు 1,02,046 మంది ఉన్నారని అధికారులు అంటున్నారు.

Telugudesam and YCP parties are planning to win in Chittoor anyway

2019 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి ఆరణి శ్రీనివాసులు అలియాస్ జంగాలపల్లె శ్రీనివాసులుకు 91,206 ఓట్లు పోలవ్వగా, టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన ఏఎస్ మనోహర్‌కు 51,238 ఓట్లు పడ్డాయి. మొత్తంగా వైసీపీ 39,968 ఓట్ల మెజారిటీతో తొలిసారిగా చిత్తూరులో పాగా వేసింది. 2024 ఎన్నికల సమీపించడంతో చిత్తూరు సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే జంగాలపల్లె శ్రీనివాసులకు టికెట్ దక్కదని తేలడంతో ఆయన జనసేనలో చేరారు. చిత్తూరులో ఎంసీ విజయేంద్ర రెడ్డిని వైసీపీ అభ్యర్ధిగా ప్రకటించారు. జంగాలపల్లె శ్రీనివాసులు తిరుపతి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

చిత్తూరులో టీడీపీ కేవలం మూడు సార్లు మాత్రమే గెలిచింది. ఇక్కడ మరోసారి జెండా పాతాలని నారా చంద్రబాబు నాయుడు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి టీడీపీ అభ్యర్ధిగా బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త గురజాల జగన్ మోహన్‌ను ప్రకటించారు. జగన్ పాలనపై వ్యతిరేకత, టీడీపీ జనసేన బీజేపీ కూటమి కారణంగా, కాపు ఓట్లు ఎక్కువగా ఉన్న చిత్తూరులో జనసేన మద్దతుతో విజయం సాధించాలని టీడీపీ అనేక ప్రయత్నాలు చేస్తోంది. చిత్తూరులో సీకే బాబు లేని ప్రత్యక్ష రాజకీయాలను ప్రజలు ఊహించుకోలేకపోతున్నారు. అయితే చిత్తూరులో కూడా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ముందుండి చక్రం తిప్పుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+