తాత్కాలిక సచివాలయం: 2 సంస్థలు బిడ్లు, తాత్కాలిక రాజధాని నిర్మాణంలో మార్పు
విజయవాడ: నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో తాత్కాలిక సచివాలయం కోసం సిఆర్డీఏ బిడ్లు తెరిచింది. ఎల్ అండ్ టి, షాపూర్జీ పల్లోంజీ సంస్థలు బుధవారం నాడు బిడ్లు దాఖలు చేశాయి. ఈ నెల పదో తేదిన ఫైనాన్షియల్ బిడ్లను తెరుస్తారు. అదే తేదీన టెండర్లు ఖరారు చేసి సీఆర్డీఏ ఒప్పందం చేసుకోనుంది.
రూ.180 కోట్లతో రాజధాని ప్రాంతంలో తాత్కాలిక సచివాలయం నిర్మించాలని ఏపీ ప్రభుత్వం ఆలోచన చేసిన విషయం తెలిసిందే. ఈ బాధ్యతను సీఆర్డీఏకు అప్పగించింది. మూడు బ్లాకులుగా తాత్కాలిక సచివాలయ భవనం నిర్మించనున్నారు.

టెండరు ఖరారయ్యాక చెప్పిన గడువు కంటే ముందే తాత్కాలిక సచివాలయాన్ని పూర్తి చేయడం పై కూడా సీఆర్డీఏ దృష్టి సారించింది. మరోవైపు, తాత్కాలిక రాజధాని నిర్మాణంలో స్వల్ప మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
అమరావతి టౌన్ షిప్ బదులు వెలగపూడి, మల్కాపురం పరిధిలో తాత్కాలిక రాజధానిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు మంగళగిరిలో అమరావతి టౌన్ షిప్లో భవనం నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications