వెలగపూడిలో సందడి, అందుకే సైకిల్ పైన హైదరాబాద్ టు బెజవాడ
విజయవాడ: బుధవారం మధ్యాహ్నం సరిగ్గా గం.2.59 నిమిషాలకు వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం ప్రారంభమవుతుంది. సచివాలయం.. ప్రభుత్వ కార్యాలయం అయినా కార్పోరేట్ ఆఫీస్ వాతావరణం కనిపిస్తోందని అంటున్నారు. 120 రోజుల్లోనే సచివాలయం నిర్మించిన విషయం తెలిసిందే.
రాష్ట్ర విభజన అనంతరం ఇప్పటిదాకా హైదరాబాద్ కేంద్రంగానే సాగిన ఏపీ పాలన ఈ రోజు నుంచి నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి పరిధిలోని వెలగపూడి నుంచి కేంద్రంగా కొనసాగనుంది. తాత్కాలిక సచివాలయంలోని ఐదో బ్లాకులోని గ్రౌండ్ ఫ్లోర్లో ప్రారంభోత్సవం జరుగుతోంది.
5 బస్సుల్లో వెలగపూడికి.. సీఎం లేకుండానే: హైద్రాబాద్ ఫర్నీచర్ వద్దు!
ఈ కీలక ఘట్టానికి హాజరయ్యేందుకు ఉద్యోగులు హైదరాబాద్ నుంచి ఐదు బస్సుల్లో వెలగపూడి బయలుదేరిన విషయం తెలిసిందే. మాకం వెలగపూడి చేరుకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న స్థానిక ఉద్యోగులు వారిని హర్షధ్వానాలు పలుకుతూ ఘన స్వాగతం పలికారు. వెలగపూడిలో సందడి కనిపిస్తోంది.
హైదరాబాద్కు గుడ్బై, సైకిల్ పైన అమరావతి బయలుదేరిన మహిళా ఉద్యోగి
Proud to announce that the Secretariat at Velagapudi will be inaugurated at 2:59 pm today and few depts will begin operations.
— N Chandrababu Naidu (@ncbn) June 29, 2016
పద్మజకు ఘన స్వాగతం
అమరావతి పైన విమర్శలు తిప్పికొట్టేందుకు హైదరాబాద్ నుంచి విజయవాడకు సైకిల్ పైన వచ్చిన పద్మజ బెజవాడకు చేరుకుంది. ఆమెకు ఏపీ మంత్రులు, దేవినేని, శిద్దా రాఘవ రావు తదితరులు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. నా రాజధాని, నా రాష్ట్రం సురక్షితం అని చాటేందుకే తాను సైకిల్ పైన వచ్చానని చెప్పారు.