వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గజ్వెల్లో ఉద్రిక్తత, అవకాశం వచ్చిందని హీరో నాగార్జున
మరోవైపు టిడిపి అభ్యర్థి ప్రతాప్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లా జూలూరుపాడులో టిడిపి, సిపిఐ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్కు స్వల్ప గాయాలయ్యాయి.
అవకాశం వచ్చింది.. వినియోగించుకోండి: నాగార్జున
ఐదేళ్ల తర్వాత ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం వచ్చిందని ఓటర్లు అందరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని హీరో అక్కినేని నాగార్జున చెప్పారు. ఆయన జూబ్లీహిల్స్లో తన భార్య అమలతో కలిపి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
ఈ అవకాశాన్ని అందరు వినియోగించుకోవాలని సూచించారు. ఐదేళ్ల తర్వాత మీ నాయకుడిని ఎన్నికునే అవకాశం వచ్చిందన్నారు. మీ భవిష్యత్తు మీ చేతుల్లోకి తీసుకునే నిర్ణయమన్నారు.
Comments
andhra pradesh assembly election 2014 lok sabha election 2014 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2014 లోకసభ ఎన్నికలు 2014
English summary
Tenstion took place in Gajwel on Wednesday morning.