పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!
పదో తరగతి పరీక్షల వాల్యుయేషన్ .. ఫలితాల వెల్లడి షెడ్యూల్ ఖరారు చేసారు. ఏప్రిల్ 2వ తేదీ తో పదో తరగతి పరీక్షలు పూర్తి కానున్నాయి. వీలైనంత త్వరగా మూల్యాంకనం పూర్తి చేసిన ఫలితా లను విడుదల చేయాలని ఏపీ విద్యా శాఖ భావిస్తోంది. ఫలితాలను సాధ్యమైనంత త్వరగా ప్రకటిస్తే విద్యార్ధులకు ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు. దీంతో.. పది రోజుల పాటు పరీక్షా పత్రాల వాల్యుయేషన్ తేదీలను ఖరారు చేసారు. ఫలితాల వెల్లడి పైన అధికారులు ఒక అంచనా కు వచ్చారు.
ఏపీలో పదో తరగతి పరీక్షలు చివరి దశకు వచ్చాయి. ఈ నెల 16న ప్రారంభమైన పరీక్షలు వచ్చే నెల ఏప్రిల్ 2వ తేదీతో ముగియనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,40,916 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తున్నారు. పరీక్షలు పూర్తయిన వెంటనే జవాబు పత్రాల మూల్యాకనం ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఏప్రిల్ 4వ తేదీ నుంచి పది రోజుల పాటు ఏప్రిల్ 13 వరకు మూల్యాంకనం ప్రక్రియ నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీ క్షల విభాగం వెల్లడించింది. మూల్యాంకనంలో పాటించాల్సిన నిబంధనలపై డైరెక్టర్ శ్రీనివాసుల రెడ్డి తాజాగా మార్గదర్శకాలు విడుదల చేశారు. రాష్ట్రంలోని మొత్తం 26 జిల్లా కేంద్రాల్లో 10 రోజుల పాటు ఈ మూల్యాంకనం నిర్వహించనున్నారు. ఒక్కో అసిస్టెంట్ ఎగ్జామినర్కు ఒక రోజుకు 40 జవాబు పత్రాలను అందిస్తారు. ఇందులో ఉదయం 20, మధ్యాహ్నం నుంచి 20 చొప్పున జవాబు పత్రాలను మూల్యాంకనం చేయాల్సి ఉంటుంది.

ఏప్రిల్ మూడో వారంలో ఫలితాల విడుదల..!
కాగా, మార్కులను మాన్యువుల్తో పాటు ట్యాబ్ల్లోనూ నమోదు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ విధానం ఈ సారి నుంచి ఇంటర్ తో పాటుగా పదో తరగతి వాల్యుయే షన్ లోనూ అమలు కానుంది. మార్కుల లెక్కింపులో పొరపాటు లేకుండా ఉండేందుకు ఈ ఏడాది ట్యాబ్లను తీసుకొచ్చారు. మార్కులను ఎప్పటికప్పుడు ట్యాబుల్లో నమోదు చేసి పొరబాట్లకు తావులేకుండా ఖచ్చితత్వం పాటించాలని హెచ్చరించింది. కాగా, ఏప్రిల్ 14 నుంచి మార్కుల నమోదు ప్రక్రియను మరో 10 రోజుల్లో పూర్తి చేసి ఏప్రిల్ మూడో వారం నాటికి పదో తరగతి ఫలితాలు వెల్లడించాలని విద్యాశాఖ భావిస్తుంది. గతే ఏడాదిలో ఏప్రిల్ 23వ తేదీన ఏపీ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల చేసారు. ఈ సారి దాదాపుగా ఏప్రిల్ 20 నుంచి 25 మధ్యన పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
-
స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల సేవల పై ప్రభుత్వం అనూహ్య నిర్ణయం, తాజా ఆదేశాలు..!! -
జగన్ అరెస్ట్ ఖాయం - తేల్చేసిన బీజేపీ ముఖ్య నేత..!! -
ఇక మంటలే: ఈరోజు, రేపు బయటకు రావద్దు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరికలు..!! -
పట్టు చిక్కుతున్న వేళ చంద్రబాబు చేతికి జగన్ మరో అస్త్రం, సెల్ఫ్ గోల్..!! -
Amaravati: అసెంబ్లీలో రాజధాని తీర్మానం-స్పీకర్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..! -
జగన్ కు జనాలిచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా సరిపోలేదేమో..మంత్రి లోకేష్ సెటైర్లు -
Amaravati: అమరావతిపై అసెంబ్లీ తీర్మానం-ఇవాళే కేంద్రానికి-చంద్రబాబు కామెంట్స్..! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది?













Click it and Unblock the Notifications