ప్రేయసితో కలిసి చోరీలు: పోలీసులకు చిక్కిన ప్రియుడు
విశాఖపట్నం: ప్రేయసితో కలిసి చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగ శివ భవాని ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. విశాఖపట్నంలో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం పోలీసులు పిఎం పాలెం వద్ద తనిఖీలు చేస్తుండగా శివర భవానికి వారికి చిక్కాడు.
శివ భవాని నుంచి పోలీసులు 30 తులాల బంగారం, ల్యాప్టాప్, 3 బైకులు స్వాధీనం చేసుకున్నారు. శివ భవానిపై జిల్లావ్యాప్తంగా పలు దొంగతను కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. శివ భవానిని పోలీసులు విచారిస్తున్నారు.
పాలకొల్లులో భారీ చోరీ
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని ఓ ఇంట్లో మంగళవారం రాత్రి దొంగతనం జరిగింది. పాలకొల్లు రూరల్ పంచాయతీ యాళ్లవానిగరువు గ్రామానికి చెందిన అభి సెల్పాయింట్ యచజమాని ప్రసాద్ బాబు కుటుంబంతో సహా మంగళవారంనాడు విశాఖపట్నం వచ్చాడు. తిరిగి ఇంటికి చేరుకునే సరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది.
బీరువాలో ఉన్న 12 గ్రాముల బంగారు ఆభరణఆలు, రెండు కిలోల వెండి సామగ్రి కనిపించలేదు. దీంతో బాధితుడు బుధవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశఆడు. ఏలూరు నుంచి క్లూస్ టీమ్లను రప్పించి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
రామాలయంలో చోరీ
కృష్ణా జిల్లా కంకిపాడులోని రామాలయంలో దొంగతనం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం తెల్లవారు జామున ఆలయంలోకి ప్రవేశించి హుండీని కొల్లగొట్టుకుని పారిపోయారు. ఉదయం ఆలయానికి వచ్చిన అర్చకులు చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి కమిటీకి తెలిపారు.