ఏటీఎం ఎత్తుకెళ్ళిన దొంగలు, అర్దరాత్రి భారీ చోరీ
హైదరాబాద్: ఏటీఎం చోరీ చేసేందుకు వెళ్లిన దొంగలు డబ్బులు ఎలా తీసుకోవాలో తెలియక... ఏకంగా ఏటీఎంనే ఎత్తుకెళ్ళారు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో జరిగింది. వివరాల్లోకి వెళితే ఎటీఎంలోకి వెళ్లిన దొంగలు కొద్ది సేపు ఆలోచించి ఏకంగా ఏటీఎంలోని విత్ డ్రాయల్ మెషీన్ ను వారు ఎత్తుకెళ్లిపోయారు.
అంతేకాదు, తమనెవరూ గుర్తుపట్టకుండా సీసీ కెమెరాకు మసి రాసి చోరీకి పాల్పడ్డారు. ఉదయం చోరీ జరిగినట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేబట్టారు. ఎటీఎం మిషన్లో రూ. 10.40 లక్షల నగదు ఉన్నట్లు సమాచారం.

హైదరాబాదు నగరంలోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని హుడాసాయినగర్లోని ఇంట్లో శనివారం అర్దరాత్రి దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. కల్పన ఎన్క్లేవ్ అపార్ట్మెంట్లో చోరికి పాల్పడిన దుండగులు 55 తులాల బంగారు నగలతో పాటు, ఓ ఇంట్లో రూ.10వేల నగదుతోపాటు తులం బంగారు ఆభరణాలు ఆపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications